ప్రకాశం జిల్లా కనిగిరి మండల కేంద్రంలో రైతులు... ఆంధ్రా బ్యాంకు వద్ద ఆందోళన చేపట్టారు. సుమారు 20 సంవత్సరాల నుంచి ఆంధ్రా బ్యాంకును నమ్ముకొని పంట రుణాలను తీసుకొంటూ... పంటలను సాగుచేస్తున్నామని తెలిపారు.
సకాలంలో రుణాలు చెల్లించినా... బ్యాంక్ మేనేజర్ లేరన్న సాకు చూపి లోన్లు ఇవ్వట్లేదని వాపోయారు. ఖరీఫ్లో ఇవ్వాల్సిన క్రాప్ లోన్లు, టొబాకో బ్యార్నీ లోన్లు త్వరగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆంధ్రా బ్యాంకుకు త్వరగా మేనేజర్ని నియమించి రుణాలను మంజూరు చేయాలని రైతులు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: