ప్రకాశం జిల్లా పర్చూరు మండలం రుద్రమాంబపురం తెదేపా అధినేత చంద్రబాబు పర్యటించారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న తెదేపా కార్యకర్త పద్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు. తెదేపా తరఫున రూ.5 లక్షలు ఆర్థికసాయం అందించారు. పద్మ పిల్లలను ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదివిస్తామని హామీ ఇచ్చారు. ఈ మృతికి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. దాడిలో పద్మ భర్తకు తీవ్ర గాయాలయ్యాయన్న చంద్రబాబు...ఇలాంటి ఘటనలను నాగరిక సమాజం ఖండించాలని పిలుపునిచ్చారు.
ఇటువంటి ఘటనలు జరుగుతుంటాయని హోంమంత్రి స్వయంగా అంటున్నారని విమర్శించారు. దాడులపై సీఎం జగన్ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. తెదేపా కార్యకర్తలను కొట్టి, తిరిగి వారిపైనే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 95 దాడులు జరిగాయన్న చంద్రబాబు స్పష్టం చేశారు. తన రక్షణ అంశంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. ఈ ప్రభుత్వం శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
ఇదీ చదవండి : కంటేనే అమ్మ అని... అంటే ఎలా...!