ప్రకాశం జిల్లా చీరాలలోని జవహర్నగర్లో దుర్గారావు అనే వ్యక్తి ఆర్థిక ఇబ్బందులు తాళలేక.. ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దుర్గారావు పర్చూరులో ఓ టీ దుకాణంలో పని చేసేవాడు. ప్రస్తుతం కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఇంటి వద్దే ఉంటున్నాడు. భార్య.. పిల్లలతో కలిసి గుంటూరు జిల్లా భట్టిప్రోలులోని పుట్టింటికి వెళ్లింది.
తన మృతికి ఎవరూ కారణం కాదని.. కేవలం లాక్డౌన్ వల్ల ఆర్థిక ఇబ్బందులతోని బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు మృతుడు సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. మృతుని బంధువులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి..