ETV Bharat / state

'నా పిల్లులను ఎవరో చంపేశారు.. గుర్తించండి.. శిక్షించండి'

ప్రాణంగా పెంచుకుంటున్న పిల్లులను గుర్తుతెలియని వ్యక్తులు చంపేశారని ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓ మహిళ ఆందోళన వ్యక్తం చేసింది. అంతే కాకుండా పిల్లులను పెంచుకుంటున్న షెడ్డునూ తొలగించారని.. వాపోయింది.

author img

By

Published : Jul 14, 2020, 10:52 PM IST

Woman protest in ongole prakasam district
పిల్లులను చంపేశారంటూ ఒంగోలులో మహిళ ఆందోళన

ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని పేర్నమెట్టలో నివాసముంటున్న శాంతకుమారి.. ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమెకు మూగజీవులను పెంచుకోవడం అలవాటు. ఇందులో భాగంగా.. పిల్లులను పెంచుకుంటోంది. కొన్ని రోజుల నుంచి పిల్లుల సంఖ్య తగ్గిపోతూ వస్తోంది.

ఎవరో కావాలనే తాను పెంచుకుంటున్న పిల్లులను చంపేస్తున్నారని, అంతేకాకుండా పిల్లుల కోసం ఏర్పాటు చేసిన షెడ్డును ధ్వంసం చేశారని ఆరోపిస్తూ ఒంగోలులో ఆమె నిరసన చేపట్టారు. మూగజీవాల పట్ల నిర్దయగా వ్యవహరించినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని పేర్నమెట్టలో నివాసముంటున్న శాంతకుమారి.. ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమెకు మూగజీవులను పెంచుకోవడం అలవాటు. ఇందులో భాగంగా.. పిల్లులను పెంచుకుంటోంది. కొన్ని రోజుల నుంచి పిల్లుల సంఖ్య తగ్గిపోతూ వస్తోంది.

ఎవరో కావాలనే తాను పెంచుకుంటున్న పిల్లులను చంపేస్తున్నారని, అంతేకాకుండా పిల్లుల కోసం ఏర్పాటు చేసిన షెడ్డును ధ్వంసం చేశారని ఆరోపిస్తూ ఒంగోలులో ఆమె నిరసన చేపట్టారు. మూగజీవాల పట్ల నిర్దయగా వ్యవహరించినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి:

'ఇంత దుర్మార్గమైన పాలన ఎప్పుడూ చూడలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.