ETV Bharat / state

'భూముల విక్రయంపై వస్తున్న వార్తాల్లో నిజం లేదు' - వేణుగోపాలస్వామి భూములు అమ్మివేత వార్తలు

నెల్లూరులోని ప్రసిద్ధి శ్రీవేణుగోపాల స్వామి ఆలయ భూముల విక్రయంపై వస్తున్న వార్తల గురించి... దేవస్థానం ఛైర్మన్ లక్ష్మీనాథ్ రెడ్డి స్పందించారు. 3కోట్ల రూపాయల బకాయిల కోసం వందల కోట్ల విలువైన ఆస్తులు అమ్ముతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజంలేదన్నారు.

Breaking News
author img

By

Published : Dec 7, 2019, 8:56 PM IST


నెల్లూరు మూలపేటలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ అభివృద్ధి కోసం... దేవస్థానం భూముల అమ్మాలని ప్రతిపాదనలు పంపామని ఆలయ ఛైర్మన్ మన్నెం లక్ష్మీనాథ్ రెడ్డి తెలిపారు. మూడు కోట్ల రూపాయల ఆలయ బకాయిల కోసం... వందల కోట్ల విలువైన ఆస్తులు అమ్ముతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. 139 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం ప్రస్తుతం శిథిలావస్థకు చేరిందని, ఆలయ పునర్నిర్మాణంతో పాటు వివాహ మండపాలు, అర్చకుల వసతి భవనాల నిర్మాణాలకు దాదాపు 20 నుంచి 25 కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయని ఆయన అంచనా వేశారు. ఆలయానికి సంబంధించి 13 కోట్ల రూపాయల ఫిక్స్​డ్ డిపాజిట్లు ఉన్నాయని, వీటి ద్వారా వచ్చే నగదుతోనే ఆలయ నిర్వహణ జరుగుతోందన్నారు.


నెల్లూరు మూలపేటలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ అభివృద్ధి కోసం... దేవస్థానం భూముల అమ్మాలని ప్రతిపాదనలు పంపామని ఆలయ ఛైర్మన్ మన్నెం లక్ష్మీనాథ్ రెడ్డి తెలిపారు. మూడు కోట్ల రూపాయల ఆలయ బకాయిల కోసం... వందల కోట్ల విలువైన ఆస్తులు అమ్ముతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. 139 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం ప్రస్తుతం శిథిలావస్థకు చేరిందని, ఆలయ పునర్నిర్మాణంతో పాటు వివాహ మండపాలు, అర్చకుల వసతి భవనాల నిర్మాణాలకు దాదాపు 20 నుంచి 25 కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయని ఆయన అంచనా వేశారు. ఆలయానికి సంబంధించి 13 కోట్ల రూపాయల ఫిక్స్​డ్ డిపాజిట్లు ఉన్నాయని, వీటి ద్వారా వచ్చే నగదుతోనే ఆలయ నిర్వహణ జరుగుతోందన్నారు.

ఇదీ చదవండి : వేణుగోపాలుడి ఆలయ ఆస్తుల అమ్మకానికి రంగం సిద్ధం..!

Intro:Ap_Nlr_01_07_Venugopala_Swami_Pressmeet_Kiran_Avb_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
నెల్లూరు మూలపేటలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ అభివృద్ధి కోసం భూముల అమ్మాలని ప్రతిపాదనలు పంపామని ఆలయ చైర్మన్ మన్నెం లక్ష్మీనాద్ రెడ్డి తెలిపారు. మూడు కోట్ల రూపాయల ఆలయ బకాయిల కోసం వందల కోట్ల రూపాయల ఆస్తులు అమ్ముతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన ఆలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. 139 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ఆలయం ప్రస్తుతం శిథిలావస్థకు చేరిందని, ఆలయ పునర్నిర్మాణం తోపాటు వివాహ మండపాలు, అర్చకుల వసతి భవనాల నిర్మాణాలకు దాదాపు 20 నుంచి 25 కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయని ఆయన తెలిపారు. ఆలయానికి సంబంధించి 13కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయని, వీటి ద్వారా కోటి రూపాయలకు పైగా వచ్చే నగదు తోనే ఆలయ నిర్వహణ జరుగుతోందన్నారు. ఆలయ పునర్నిర్మాణానికి ఆస్తులు అమ్మాలని గతంలో ప్రతిపాదనలు పంపామని, ప్రభుత్వం అంగీకరిస్తే ఓపెన్ ఆక్షన్ ద్వారానే ఆ ప్రక్రియ జరుగుతుందన్నారు. ఆయిల్ పరిశ్రమలకు కొన్ని భూములు లీజుకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.
బైట్: మన్నెం లక్ష్మి నాథ్ రెడ్డి, వేణుగోపాలస్వామి ఆలయ చైర్మన్, నెల్లూరు.


Body:కిరణ్ ఈటీవీ భారత్


Conclusion:9394450291

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.