ETV Bharat / state

నెల్లూరులో పుర ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల - పురఎన్నికలకు ఈవీఎంల వినియోగం వార్తలు

నెల్లూరు జిల్లాలోని పలు పురపాలక సంఘాల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్‌ చక్రధర్‌బాబు తెలిపారు. ఇప్పటికే నామినేషన్‌ ప్రక్రియ పూర్తయిందని కలెక్టర్ అన్నారు. ఈ ఎన్నికల్లో ఈవీఎంలు వినియోగించనున్నట్లు వెల్లడించారు. ఎన్నికలు, లెక్కింపునకు పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.

SEC has issued notification for municipal elections in Nellore district
నెల్లూరులో పురఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల
author img

By

Published : Feb 17, 2021, 3:47 PM IST

రాష్ట్ర ఎన్నికల సంఘం నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరి పురపాలక సంఘాల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు కలెక్టర్‌ చక్రధర్‌బాబు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందన్నారు. ఆత్మకూరు 23, వెంకటగిరి 25, నాయుడుపేట 25, సూళ్లూరుపేట 26 చొప్పున మొత్తం 99 వార్డులకు ఎన్నికలు జరుగుతాయన్నారు.

ఈ నాలుగు పురపాలక సంఘాల్లో నామినేషన్‌ ప్రక్రియ పూర్తయిందని, మొత్తం 531 మంది నామినేషన్లు అందించారని వివరించారు. ఆత్మకూరు 114, వెంకటగిరి 144, నాయుడుపేట 152, సూళ్లూరుపేట 121 నామినేషన్లు దాఖలయ్యాయన్నారు. ఈ ఎన్నికల్లో ఈవీఎంలు వినియోగించనున్నట్లు వెల్లడించారు. ఎన్నికలు, లెక్కింపునకు పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

మున్సిపాలిటీల్లో గతం కంటే అధికంగా ఓటింగ్‌ నమోదయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. నాలుగు పురపాలక సంఘాల్లో ఎన్నికలు సజావుగా, పారదర్శకంగా జరిగేలా నెల్లూరు నగరపాలక సంస్థ అధికారులను నోడల్‌ అధికారులుగా నియమిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణకు 921 మంది సిబ్బందిని నియమించామని, పోలింగ్‌, కౌంటింగ్‌ ప్రక్రియపై శిక్షణ ఇస్తామన్నారు. సమావేశంలో జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్‌, జాయింట్‌ కలెక్టర్లు డాక్టర్‌ ఎన్‌.ప్రభాకరరెడ్డి, డాక్టర్‌ హరేంధిరప్రసాద్‌, రెవెన్యూ అధికారి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.