ETV Bharat / state

'అనవసరంగా బయటకు వస్తే క్వారంటైన్​కే..!'

author img

By

Published : May 1, 2020, 3:16 PM IST

చిన్న చిన్న కారణాలతో ఎవరైనా రోడ్లపైకి వస్తే వారి వాహనాలు సీజ్ చేసి కేసు నమోదు చేయడం సహా వారిని క్వారంటైన్​కు తరలిస్తామని అధికారులు హెచ్చరించారు. లాక్​డౌన్​ రెండో దశ ముగుస్తున్న తరుణంలో నెల్లూరు అధికారులు పలు సూచనలు చేశారు.

nellore rto hussen
నెల్లూరు ఆర్టీఓ హుస్సేన్ సాహెబ్


అనవసరంగా రోడ్లపై తిరిగితే క్వారంటైన్​కు తరలిస్తామని నెల్లూరు రెవెన్యూ, పోలీసు అధికారులు హెచ్చరించారు. లాక్​డౌన్ రెండో దశ ముగుస్తున్న సమయంలోనూ కరోనా కేసులు పెరగడం వల్ల కఠినంగా వ్యవహరించక తప్పడం లేదని ఆర్టీఓ హుస్సేన్ సాహెబ్, నగర్ డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. చిన్న చిన్న కారణాలతో ఎవరైనా రోడ్లపైకి వస్తే వాహనాలు సీజ్ చేసి, కేసు నమోదు చేయడం సహా క్వారంటైన్​కు తరలిస్తామని హెచ్చరించారు. నిత్యావసర వస్తువులు నివాస ప్రాంతానికి మూడు కిలోమీటర్ల పరిధిలో, నిర్దేశించిన సమయంలో.. ఒకరు మాత్రమే వెళ్లి కొనుగోలు చేయాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠినచర్యలు తీసుకుంటామని అన్నారు.

ఇవీ చూడండి...


అనవసరంగా రోడ్లపై తిరిగితే క్వారంటైన్​కు తరలిస్తామని నెల్లూరు రెవెన్యూ, పోలీసు అధికారులు హెచ్చరించారు. లాక్​డౌన్ రెండో దశ ముగుస్తున్న సమయంలోనూ కరోనా కేసులు పెరగడం వల్ల కఠినంగా వ్యవహరించక తప్పడం లేదని ఆర్టీఓ హుస్సేన్ సాహెబ్, నగర్ డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. చిన్న చిన్న కారణాలతో ఎవరైనా రోడ్లపైకి వస్తే వాహనాలు సీజ్ చేసి, కేసు నమోదు చేయడం సహా క్వారంటైన్​కు తరలిస్తామని హెచ్చరించారు. నిత్యావసర వస్తువులు నివాస ప్రాంతానికి మూడు కిలోమీటర్ల పరిధిలో, నిర్దేశించిన సమయంలో.. ఒకరు మాత్రమే వెళ్లి కొనుగోలు చేయాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠినచర్యలు తీసుకుంటామని అన్నారు.

ఇవీ చూడండి...

మంత్రి గౌతంరెడ్డికి మరో కీలక శాఖ బాధ్యతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.