ETV Bharat / state

Lokesh on BCs బీసీల రక్షణ కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకువస్తాం.. లోకేశ్ - లోకేశ్ డ్రైవర్ తో పోలీసుల దురుసు ప్రవర్తన

Lokesh YuvaGalam Padayatra నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం బంగారుపాళ్యంలో బీసీలతో నారా లోకేశ్‌ ముఖాముఖి నిర్వహించారు. బీసీ కార్పొరేషన్లకు నిధులిచ్చి..ఉప కులాలన్నింటికీ న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం తీసేసిన గోపాలమిత్రల వ్యవస్థను మళ్లీ తీసుకొస్తామన్నారు. మరోవైపు కావలి నియోజక వర్గంలో కొనసాగుతున్న యువగళం పాదయాత్రలో పోలీసుల దురుసు ప్రవర్తన కాసేపు ఉద్రిక్తతలకు దారి తీసింది.

Nara Lokesh YuvaGalam Padayatra:
బీసీల రక్షణ కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకువస్తాం
author img

By

Published : Jul 9, 2023, 10:31 PM IST

Lokeshs Interact With BCs టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఆదివారం నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో కొనసాగింది. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని బంగారుపాళ్యంలో బీసీలతో నారా లోకేశ్‌ ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు. బీసీల సంక్షేమ పథకాలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్న ఆయన కార్పొరేషన్లలో కనీసం జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. బీసీ కార్పొరేషన్లకు నిధులిచ్చి ఉప కులాలన్నింటికీ న్యాయం చేస్తామని నారా లోకేశ్‌ భరోసా ఇచ్చారు. టీడీపీ పాలనలో బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యత, పథకాలను వివరించారు.

బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం : వైసీపీ ప్రభుత్వం హయంలో బీసీలకు తగిన ప్రోత్సాహం కరవై ఇబ్బందులు పడుతున్నామని, తమ అభివృద్ధి తోడ్పడే పథకాలు లేకుండా చేశారని పలువురు బీసీలు.. లోకేశ్‌ దృష్టికి తీసుకొచ్చారు. తమపైనే దాడులు చేసి, ఎదురు కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ గెలిచిన మొదటి సంవత్సరంలోనే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకువస్తామని లోకేశ్ వారికి హామీ ఇచ్చారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే బీసీలను అన్ని విధాల ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అమరనాథ్‌ గౌడ్‌ లాంటి హత్య ఘటనలు జరగకుండా చూస్తామని ఆయన అన్నారు. వైసీపీ తీసేసిన గోపాల మిత్రల వ్యవస్థను మళ్లీ తీసుకొస్తామని ఆయన హామీ ఇచ్చారు. అవసరమైన చోట రజకుల కోసం ధోబీఘాట్‌లను కడతామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు తగ్గించిన 10 శాతం రిజర్వేషన్లను తిరిగి పునరుద్ధరిస్తామని ఆయన అన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఒక్క కి.మీ. రోడ్డు వేశారా.. డ్రెయిన్‌ వేశారా అని నారా లోకేశ్ ప్రశ్నించారు.

'తెలుగుదేశం పార్టీ బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకువస్తాం. అది కూడా మనం గెలిచిన మొదటి సంవత్సరంలోనే తీసుకువస్తాం. ఆధరణ పథకం ప్రతీ సంవత్సరం అమలు చేస్తాం. మెరుగైనా పనిముట్లు మీకు అందజేస్తాం. ఉపకులాల వారిగా కార్పోరేషన్లు ఏర్పాటు చేస్తాం. కార్పోరేషన్లకు నిధుల కేటాయించి పేదరికం నుంచి బయటకు తీసుకు వచ్చే లక్ష్యంతో పని చేస్తాం. వైసీపీ ప్రభుత్వం తీసేసిన గోపాల మిత్రల వ్యవస్థను మళ్లీ తీసుకొస్తాం.'- నారా లోకేశ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్

బీసీల రక్షణ కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకువస్తాం

నారా లోకేశ్ డ్రైవర్​పై దాడికి దిగిన సీఐ : కావలి నియోజక వర్గంలో కొనసాగుతున్న యువగళం పాదయాత్రలో పోలీసుల దురుసు ప్రవర్తన చర్చనీయాంశమైంది. లోకేశ్ పాదయాత్ర ప్రారంభానికి ముందు కడపాలెం గ్రామం వద్ద లోకేశ్ డ్రైవర్​పై కావలి రూరల్ సీఐ రాజేష్ భౌతిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనతో టీడీపీ కార్యకర్తలు గుమ్మిగుడి పోలీసులను నిలదీశారు.

నారా లోకేశ్ డ్రైవర్​పై దాడికి దిగిన సీఐ

Lokeshs Interact With BCs టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఆదివారం నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో కొనసాగింది. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని బంగారుపాళ్యంలో బీసీలతో నారా లోకేశ్‌ ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు. బీసీల సంక్షేమ పథకాలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్న ఆయన కార్పొరేషన్లలో కనీసం జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. బీసీ కార్పొరేషన్లకు నిధులిచ్చి ఉప కులాలన్నింటికీ న్యాయం చేస్తామని నారా లోకేశ్‌ భరోసా ఇచ్చారు. టీడీపీ పాలనలో బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యత, పథకాలను వివరించారు.

బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం : వైసీపీ ప్రభుత్వం హయంలో బీసీలకు తగిన ప్రోత్సాహం కరవై ఇబ్బందులు పడుతున్నామని, తమ అభివృద్ధి తోడ్పడే పథకాలు లేకుండా చేశారని పలువురు బీసీలు.. లోకేశ్‌ దృష్టికి తీసుకొచ్చారు. తమపైనే దాడులు చేసి, ఎదురు కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ గెలిచిన మొదటి సంవత్సరంలోనే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకువస్తామని లోకేశ్ వారికి హామీ ఇచ్చారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే బీసీలను అన్ని విధాల ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అమరనాథ్‌ గౌడ్‌ లాంటి హత్య ఘటనలు జరగకుండా చూస్తామని ఆయన అన్నారు. వైసీపీ తీసేసిన గోపాల మిత్రల వ్యవస్థను మళ్లీ తీసుకొస్తామని ఆయన హామీ ఇచ్చారు. అవసరమైన చోట రజకుల కోసం ధోబీఘాట్‌లను కడతామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు తగ్గించిన 10 శాతం రిజర్వేషన్లను తిరిగి పునరుద్ధరిస్తామని ఆయన అన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఒక్క కి.మీ. రోడ్డు వేశారా.. డ్రెయిన్‌ వేశారా అని నారా లోకేశ్ ప్రశ్నించారు.

'తెలుగుదేశం పార్టీ బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకువస్తాం. అది కూడా మనం గెలిచిన మొదటి సంవత్సరంలోనే తీసుకువస్తాం. ఆధరణ పథకం ప్రతీ సంవత్సరం అమలు చేస్తాం. మెరుగైనా పనిముట్లు మీకు అందజేస్తాం. ఉపకులాల వారిగా కార్పోరేషన్లు ఏర్పాటు చేస్తాం. కార్పోరేషన్లకు నిధుల కేటాయించి పేదరికం నుంచి బయటకు తీసుకు వచ్చే లక్ష్యంతో పని చేస్తాం. వైసీపీ ప్రభుత్వం తీసేసిన గోపాల మిత్రల వ్యవస్థను మళ్లీ తీసుకొస్తాం.'- నారా లోకేశ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్

బీసీల రక్షణ కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకువస్తాం

నారా లోకేశ్ డ్రైవర్​పై దాడికి దిగిన సీఐ : కావలి నియోజక వర్గంలో కొనసాగుతున్న యువగళం పాదయాత్రలో పోలీసుల దురుసు ప్రవర్తన చర్చనీయాంశమైంది. లోకేశ్ పాదయాత్ర ప్రారంభానికి ముందు కడపాలెం గ్రామం వద్ద లోకేశ్ డ్రైవర్​పై కావలి రూరల్ సీఐ రాజేష్ భౌతిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనతో టీడీపీ కార్యకర్తలు గుమ్మిగుడి పోలీసులను నిలదీశారు.

నారా లోకేశ్ డ్రైవర్​పై దాడికి దిగిన సీఐ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.