ETV Bharat / state

సమాజ సేవ విత్ ఫేస్​బుక్

ఫేస్​బుక్.. ఎంతోమందికి వినోద సాధనం. ఫొటోలు తీసుకోవడం.. అప్​లోడ్ చేయడం.. ఆనందించడం. ఇందుకోసమే చాలామంది దీనిని వినియోగిస్తుంటారు. అయితే ఓ యువకుడు వినూత్నంగా ఆలోచించాడు. తను చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఫేస్​బుక్​ను మాధ్యమంగా ఉపయోగిస్తూ.. ఎంతోమందికి సాయపడుతున్నాడు.

author img

By

Published : Jun 7, 2019, 7:29 PM IST

సమాజ సేవ విత్ ఫేస్​బుక్
సమాజ సేవ విత్ ఫేస్​బుక్

సామాజిక మాధ్యమాలతో వినోదాలే కాదు.. సేవా కార్యక్రమాలూ విజయవంతంగా చేయొచ్చని నిరూపిస్తున్నారు.. నెల్లూరుకు చెందిన రసూల్. చదివింది ఇంటరే అయినా.. సమాజ సేవలో మాత్రం నిరంతరం ముందుంటున్నారు. సంపాదనలో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాలకే వినియోగిస్తున్నారు. 20 ఏళ్ల కింద ఏడుగురితో రూడ్స్ సేవా సంస్థ స్థాపించిన ఆయన.. వైద్య శిబిరాలు, నిత్యావసరాల పంపిణీ చేసేవారు. అనంతరం.. దీర్ఘ వ్యాధులతో బాధపడేవారికి సాయంతో పాటు, ప్రభుత్వ పథకాలు పేదలకు చేర్చడం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

సేవలను ఎక్కువ మందికి చేర్చేందుకు.. సామాజిక మాధ్యమ బాటలో వెళ్లిన రసూల్... ఫేస్​బుక్​లో ప్రత్యేక పేజీ ఏర్పాటు చేశారు. 5 వేల మంది దాతలను అందులో సభ్యులుగా చేశారు. పదేళ్లలోనే 80 లక్షల రూపాయల విలువైన సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రూడ్స్ కోసం.. రసూల్ తో పాటు 15 మంది క్రియాశీలకంగా పని చేస్తున్నారు. వీళ్లు.. సహాయం అర్థించే వారి వీడియోలు తీసి ఫేస్​బుక్ లో పెడతారు. బ్యాంక్ అకౌంట్, చిరునామా ఇస్తారు. దాతలు పరిశీలించి నేరుగా.. బాధితులకే ఆర్థిక సహాయం అందేలా ఏర్పాట్లు చేశారు.

సేవకు.. సామాజిక మాధ్యమాన్ని జోడిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని రసూల్.. ఆచరణలో చూపిస్తున్నారు.

ఇవీ చదవండి..

పాఠశాలలకు సకాలంలో పాఠ్యపుస్తకాలు

సమాజ సేవ విత్ ఫేస్​బుక్

సామాజిక మాధ్యమాలతో వినోదాలే కాదు.. సేవా కార్యక్రమాలూ విజయవంతంగా చేయొచ్చని నిరూపిస్తున్నారు.. నెల్లూరుకు చెందిన రసూల్. చదివింది ఇంటరే అయినా.. సమాజ సేవలో మాత్రం నిరంతరం ముందుంటున్నారు. సంపాదనలో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాలకే వినియోగిస్తున్నారు. 20 ఏళ్ల కింద ఏడుగురితో రూడ్స్ సేవా సంస్థ స్థాపించిన ఆయన.. వైద్య శిబిరాలు, నిత్యావసరాల పంపిణీ చేసేవారు. అనంతరం.. దీర్ఘ వ్యాధులతో బాధపడేవారికి సాయంతో పాటు, ప్రభుత్వ పథకాలు పేదలకు చేర్చడం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

సేవలను ఎక్కువ మందికి చేర్చేందుకు.. సామాజిక మాధ్యమ బాటలో వెళ్లిన రసూల్... ఫేస్​బుక్​లో ప్రత్యేక పేజీ ఏర్పాటు చేశారు. 5 వేల మంది దాతలను అందులో సభ్యులుగా చేశారు. పదేళ్లలోనే 80 లక్షల రూపాయల విలువైన సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రూడ్స్ కోసం.. రసూల్ తో పాటు 15 మంది క్రియాశీలకంగా పని చేస్తున్నారు. వీళ్లు.. సహాయం అర్థించే వారి వీడియోలు తీసి ఫేస్​బుక్ లో పెడతారు. బ్యాంక్ అకౌంట్, చిరునామా ఇస్తారు. దాతలు పరిశీలించి నేరుగా.. బాధితులకే ఆర్థిక సహాయం అందేలా ఏర్పాట్లు చేశారు.

సేవకు.. సామాజిక మాధ్యమాన్ని జోడిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని రసూల్.. ఆచరణలో చూపిస్తున్నారు.

ఇవీ చదవండి..

పాఠశాలలకు సకాలంలో పాఠ్యపుస్తకాలు

Intro:గుంటూరు జిల్లా నూతన కలెక్టర్ గా శామ్యూల్ ఆనంద్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. మార్కెటింగ్ శాఖ కమిషనర్ గా పనిచేస్తున్న ఆయన్ను ప్రభుత్వం గుంటూరు జిల్లా కలెక్టర్ గా బదిలీ చేసింది. దీంతో కలెక్టరేట్లోని ఛాంబర్లో బాధ్యతలు తీసుకున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలే.. తన ప్రాధాన్యతలని వీటితోపాటు విద్య, వైద్యం పై కూడా ప్రత్యేక దృష్టి పెడతానన్నారు. సాంఘిక సంక్షేమం, వైద్య ఆరోగ్యం, మార్కెటింగ్ శాఖలలో ఇప్పటివరకు పని చేశానని..మిగిలిన అంశాలపై కూడా అవగాహన పెంచుకుని జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు. జిల్లాలోని ప్రజలకు అందుబాటులో ఉంటూ జిల్లా స్థాయి అధికారుల సహకారంతో ప్రభుత్వ పథకాల విజయవంతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. తొలుత పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేయగా.. కుటుంబ సభ్యులు అధికారులు పుష్పగుచ్చాలతో అభినందనలు తెలిపారు...
bite: శామ్యూల్ ఆనంద్, కలెక్టర్ గుంటూరు జిల్లా


Body:గుంటూరు పశ్చిమ


Conclusion:kit no765
భాస్కరరావు
8008574897
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.