ETV Bharat / state

రికార్డు సృష్టించిన విజయవాడ రైల్వే డివిజన్.. ఇంతకు ముందెన్నడూ లేనంత ఆదాయం!

author img

By

Published : Apr 6, 2023, 7:20 PM IST

Vijayawada Railway Division: చరిత్రలో ఎప్పుడూ లేనంతగా.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయి ఆదాయం ఆర్జించినట్లు విజయవాడ రైల్వే డివిజన్ ఆర్ఎం శివేంద్ర మోహన్ తెలిపారు. రైల్వే స్టేషన్ అభివృద్ది కోసం డీపీఆర్ కోసం కన్సల్టెంట్​ను నియమించామని, కన్సల్టెంట్ నివేదిక రాగానే విజయవాడ స్టేషన్​లో మరిన్ని అభివృద్ది పనులు చేపడతామని తెలిపారు.

Vijayawada Railway Division
Vijayawada Railway Division

Vijayawada Railway Division: 2022-23 ఆర్థిక సంవత్సరంలో విజయవాడ రైల్వే డివిజన్ రికార్డు స్థాయి ఆదాయం అర్జించింది. డివిజన్ చరిత్రలో ఇప్పటి వరకు ఎప్పుడూ లేనంతగా రికార్డు స్థాయి ఆదాయం ఆర్జించినట్లు రైల్వే డీఆర్ఎం శివేంద్ర మోహన్ తెలిపారు. 2022-22 ఏడాదిలో విజయవాడ రైల్వే డివిజన్ ఏకంగా రూ.5306.8 కోట్ల ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. ఇందులో ప్రయాణికుల రవాణా ద్వారా రూ.1246.8 కోట్లు, సరకు రవాణా ద్వారా రూ.3912.15.. కోట్ల ఆదాయం వచ్చినట్లు వివరించారు. దేశంలో మిగిలిన డివిజన్ల కంటే విజయవాడ డివిజన్ అత్యుత్తమ ప్రగతి సాధించినట్లు తెలిపారు. ఏడాదిలో 61.518 మిలియన్ల ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరవేసినట్లు వివరించారు. అత్యధికంగా టికెటేతర ఆదాయం రూ.58.9 కోట్లు వచ్చిందన్నారు. ఈ ఏడాదిలో 146.33. కి.మీ కొత్త లైన్ నిర్మించామని డివిజన్ లో 22 లెవెల్ క్రాసింగ్​లు తొలగించి 22 రోడ్ అండర్ బ్రిడ్జిలు ఏర్పాటు చేశామని తెలిపారు. డివిజన్​లో 6 ఫుట్ ఒవర్ బ్రిడ్జిలు నిర్మించినట్లు తెలిపారు.

ఈ ఏడాదిలో విజయవాడ డివిజన్​లో 790 ప్రత్యేక రైళ్లు నడిపాం అమరావతికి కొత్త రైల్వే లైన్ ఇంకా సర్వే స్టేజిలో ఉందని అన్నారు. విజయవాడ - విశాఖపట్నం మూడో లైన్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు తెలిపారు. డివిజన్ పరిధిలో రైల్వే ప్రాజేక్టులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో చేపట్టే పలు ప్రాజెక్టులు పెండింగ్​లో ఉన్నట్లు తెలిపిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వకపోవడం వల్లే పనులు పూర్తి కావడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తే పెండింగ్ రైల్వే లైన్ల పనులు పూర్తి చేస్తామని తెలిపారు. విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ది కోసం డీపీఆర్ కోసం కన్సల్టెంట్​ను నియమించామని, కన్సల్టెంట్ నివేదిక రాగానే విజయవాడ స్టేషన్​లో మరిన్ని అభివృద్ది పనులు చేపడతామని తెలిపారు. అమృత్ ప్రాజెక్టులో భాగంగా డివిజన్​లో 15-20 రైల్వే స్టేషన్లను వచ్చే ఏడాదిలోగా అభివృద్ది చేస్తామని వెల్లడించారు.

నాలుగేళ్లుగా పనులు నత్తనడకన.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర వాటా ఇవ్వనందున.. నాలుగేళ్లుగా పనులు పడకేశాయి. ఈ సారి బడ్జెట్‌లో రైల్వే ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం భారీగా నిధులు ఇస్తుందనుకుంటే నిరాశే మిగిలింది. దాదాపు 17 వందల కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. కేవలం 150 కోట్లు మాత్రమే కేటాయించడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నిధులు ఏ మూలకూ సరిపోవని అధికారులు వాపోతున్నారు. ఇప్పట్లో పనులు ప్రారంభించే పరిస్థితి లేదని రైల్వే అధికారులు అంటున్నారు. రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్రం కేటాయించిన నిధులు చేస్తే ఈ ప్రాజెక్టులు పూర్తవడానికి కొన్ని దశాబ్దాలు పట్టొచ్చన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇవీ చదవండి:

Vijayawada Railway Division: 2022-23 ఆర్థిక సంవత్సరంలో విజయవాడ రైల్వే డివిజన్ రికార్డు స్థాయి ఆదాయం అర్జించింది. డివిజన్ చరిత్రలో ఇప్పటి వరకు ఎప్పుడూ లేనంతగా రికార్డు స్థాయి ఆదాయం ఆర్జించినట్లు రైల్వే డీఆర్ఎం శివేంద్ర మోహన్ తెలిపారు. 2022-22 ఏడాదిలో విజయవాడ రైల్వే డివిజన్ ఏకంగా రూ.5306.8 కోట్ల ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. ఇందులో ప్రయాణికుల రవాణా ద్వారా రూ.1246.8 కోట్లు, సరకు రవాణా ద్వారా రూ.3912.15.. కోట్ల ఆదాయం వచ్చినట్లు వివరించారు. దేశంలో మిగిలిన డివిజన్ల కంటే విజయవాడ డివిజన్ అత్యుత్తమ ప్రగతి సాధించినట్లు తెలిపారు. ఏడాదిలో 61.518 మిలియన్ల ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరవేసినట్లు వివరించారు. అత్యధికంగా టికెటేతర ఆదాయం రూ.58.9 కోట్లు వచ్చిందన్నారు. ఈ ఏడాదిలో 146.33. కి.మీ కొత్త లైన్ నిర్మించామని డివిజన్ లో 22 లెవెల్ క్రాసింగ్​లు తొలగించి 22 రోడ్ అండర్ బ్రిడ్జిలు ఏర్పాటు చేశామని తెలిపారు. డివిజన్​లో 6 ఫుట్ ఒవర్ బ్రిడ్జిలు నిర్మించినట్లు తెలిపారు.

ఈ ఏడాదిలో విజయవాడ డివిజన్​లో 790 ప్రత్యేక రైళ్లు నడిపాం అమరావతికి కొత్త రైల్వే లైన్ ఇంకా సర్వే స్టేజిలో ఉందని అన్నారు. విజయవాడ - విశాఖపట్నం మూడో లైన్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు తెలిపారు. డివిజన్ పరిధిలో రైల్వే ప్రాజేక్టులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో చేపట్టే పలు ప్రాజెక్టులు పెండింగ్​లో ఉన్నట్లు తెలిపిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వకపోవడం వల్లే పనులు పూర్తి కావడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తే పెండింగ్ రైల్వే లైన్ల పనులు పూర్తి చేస్తామని తెలిపారు. విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ది కోసం డీపీఆర్ కోసం కన్సల్టెంట్​ను నియమించామని, కన్సల్టెంట్ నివేదిక రాగానే విజయవాడ స్టేషన్​లో మరిన్ని అభివృద్ది పనులు చేపడతామని తెలిపారు. అమృత్ ప్రాజెక్టులో భాగంగా డివిజన్​లో 15-20 రైల్వే స్టేషన్లను వచ్చే ఏడాదిలోగా అభివృద్ది చేస్తామని వెల్లడించారు.

నాలుగేళ్లుగా పనులు నత్తనడకన.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర వాటా ఇవ్వనందున.. నాలుగేళ్లుగా పనులు పడకేశాయి. ఈ సారి బడ్జెట్‌లో రైల్వే ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం భారీగా నిధులు ఇస్తుందనుకుంటే నిరాశే మిగిలింది. దాదాపు 17 వందల కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. కేవలం 150 కోట్లు మాత్రమే కేటాయించడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నిధులు ఏ మూలకూ సరిపోవని అధికారులు వాపోతున్నారు. ఇప్పట్లో పనులు ప్రారంభించే పరిస్థితి లేదని రైల్వే అధికారులు అంటున్నారు. రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్రం కేటాయించిన నిధులు చేస్తే ఈ ప్రాజెక్టులు పూర్తవడానికి కొన్ని దశాబ్దాలు పట్టొచ్చన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.