ETV Bharat / state

వేసవి కమునుపే కృష్ణా తీరంలో తాగునీటీ సమస్య..

Drinking Water Problem Before Summer: వేసవి రాక ముందే ఎన్టీఆర్ జిల్లాలో పలు ప్రాంతాలు తీవ్ర తాగునీటి ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. తిరువూరులో ప్రజలు మంచినీటి కోసం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తాగునీటి సరఫరా ప్రాజెక్టుకు గత ప్రభుత్వం శ్రీకారం చుట్టినా... నేటికీ అది పూర్తికాలేదు. ప్రస్తుతం పది ఇళ్లకు ఒక కుళాయి ఏర్పాటు చేసి తాగునీరు అందిస్తున్నారు. ఈ నీటి సరఫరా పైపులకు రంధ్రాలు పడడంతో వాటిలోకి మురుగు నీరు చేరుతోంది.

author img

By

Published : Feb 12, 2023, 5:45 PM IST

Drinking Water Problem
Drinking Water Problem

Drinking Water Problem Before Summer: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ప్రజలకు తాగునీరందించాలన్న లక్ష్యంతో 2019లో శంకుస్థాపన చేసిన మంచినీటి సరఫరా పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రభుత్వం ఇంటింటికీ కుళాయి ఏర్పాటు చేయాలన్న లక్ష్యం నేటికీ నెరవేరలేదు. ఆసియా మౌళిక వసతుల కల్పన బ్యాంక్ నిధులు, కేంద్ర ప్రభుత్వ సహకారంతో 2019లో మంచినీటి సరఫరా పనులకు గత టీడీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టుంది. త్వరగతిన మంచినీటి సరఫరా పనులు పూర్తి చేసి తిరువూరు ప్రజలకు తాగునీరు అందించాలని భావించింది.

2019 ఎన్నికల కోడ్ అడ్డురావడంతో గత టీడీపీ ప్రభుత్వం పనులు పూర్తిచేయలేకపోయింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్ పనులు నిలుపివేసింది. రివర్స్ టెండరింగ్ ఇచ్చి పనులు ప్రారంభించినా పనుల్లో తీవ్ర జాప్యం నేటికీ కొనసాగుతుంది. చేసిన పనులకు నిధులు సకాలంలో చెల్లించకపోవడంతో గుత్తేదారులు కొంతకాలం పనులు ఆపేశారు. ప్రస్తుతం పనులు చేస్తున్నా నత్తనడకన సాగుతున్నాయి.


కాంట్రాక్టర్లకు సకాలంలో నిధులు చెల్లింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. సకాలంలో పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో పనులు మందుకు సాగలేదు. ప్రస్తుతం పనులు ప్రారంభించినా నత్తనడకన సాగుతున్నాయి. ప్రస్తుంతం పది నుంచి పదిహేను ఇళ్లకు ఒక్క కుళాయి ద్వారా తాగు నీటినీ సరఫరా చేస్తున్నారు. కుళాయి నీటిని సరఫరా చేసే పైపులు రంద్రాలు పడడంతో చుట్టూ ఉండే మురుగు నీరు కళాయి పైపుల్లోకి పోతుంది. దీంతో ట్యాంకుల్లో నీటిని శుద్ధి చేసినా ఫలితం లేకుండా పోతుందని ప్రజలు చెబుతున్నారు. పైపులు మరమత్తుకు వచ్చి వారాలు గడుస్తున్నా సరి చేయడం లేదని ప్రజలంటున్నారు. ప్రస్తుతం అందజేస్తున్న తాగునీరు మూడు రోజులకు ఒక్కసారి వస్తున్నాయని తిరువూరు ప్రజలు చెబుతున్నారు. అందజేస్తున్న మంచినీరు ప్రజల అవసరాలకు సరిపోవడం లేదని వాపోతున్నారు.

162 కోట్లతో కృష్ణా జలాలను తిరువూరు ప్రజలకు అందించాలని తలపెట్టిన మంచినీటి ప్రాజెక్టు పూర్తికాకపోవడంతో తిరువూరు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రోజుల్లో తాగునీరులేక మరిన్ని ఇబ్బందులు పడతామని ప్రజలంటున్నారు. 2019 ఎన్నికలు ముగిసాకైనా ప్రభుత్వం తమకు తాగునీరు అందిస్తుందని తిరువూరు ప్రజలు ఆశపడ్డారు. పనులు ప్రారంభించి సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ తాగునీరు అందించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశాన్ని తిరువూరు నగర పంచాయితీ అధికారులకు అడగ్గా పనులు జరుగుతున్నాయని, త్వరలోనే ఇంటింటికి తాగు నీరు అందిస్తామని చెబుతున్నారు. ప్రస్తుతం తిరువూరు నగరంలో ఓ నీటి ట్యాంక్ శిథిలావస్థకు చేరుకుంది. దాని పక్కనే నూతన వాటర్ ట్యాంక్ నిర్మిస్తున్నారు. ఇంటింటికి మంచినీరు అందించాలంటే మరో రెండు నీటి ట్యాంక్ లు నిర్మించాలి. ఆ ట్యాంకుల పనులు నేటికీ ప్రారంభించలేదు.

వేసవి సమీపిస్తుండడంతో త్వరగా మంచినీటి సరఫరా ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసి తమకు మంచినీటిని అందించాలని తిరువూరు ప్రజలు కోరుతున్నారు. తాగునీటిని అందించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడమేంటని ప్రశ్నిస్తున్నారు.

వేసవికాలం రాకమునుపే తాగునీటీ సమస్య..

ఇవీ చదవండి

Drinking Water Problem Before Summer: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ప్రజలకు తాగునీరందించాలన్న లక్ష్యంతో 2019లో శంకుస్థాపన చేసిన మంచినీటి సరఫరా పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రభుత్వం ఇంటింటికీ కుళాయి ఏర్పాటు చేయాలన్న లక్ష్యం నేటికీ నెరవేరలేదు. ఆసియా మౌళిక వసతుల కల్పన బ్యాంక్ నిధులు, కేంద్ర ప్రభుత్వ సహకారంతో 2019లో మంచినీటి సరఫరా పనులకు గత టీడీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టుంది. త్వరగతిన మంచినీటి సరఫరా పనులు పూర్తి చేసి తిరువూరు ప్రజలకు తాగునీరు అందించాలని భావించింది.

2019 ఎన్నికల కోడ్ అడ్డురావడంతో గత టీడీపీ ప్రభుత్వం పనులు పూర్తిచేయలేకపోయింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్ పనులు నిలుపివేసింది. రివర్స్ టెండరింగ్ ఇచ్చి పనులు ప్రారంభించినా పనుల్లో తీవ్ర జాప్యం నేటికీ కొనసాగుతుంది. చేసిన పనులకు నిధులు సకాలంలో చెల్లించకపోవడంతో గుత్తేదారులు కొంతకాలం పనులు ఆపేశారు. ప్రస్తుతం పనులు చేస్తున్నా నత్తనడకన సాగుతున్నాయి.


కాంట్రాక్టర్లకు సకాలంలో నిధులు చెల్లింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. సకాలంలో పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో పనులు మందుకు సాగలేదు. ప్రస్తుతం పనులు ప్రారంభించినా నత్తనడకన సాగుతున్నాయి. ప్రస్తుంతం పది నుంచి పదిహేను ఇళ్లకు ఒక్క కుళాయి ద్వారా తాగు నీటినీ సరఫరా చేస్తున్నారు. కుళాయి నీటిని సరఫరా చేసే పైపులు రంద్రాలు పడడంతో చుట్టూ ఉండే మురుగు నీరు కళాయి పైపుల్లోకి పోతుంది. దీంతో ట్యాంకుల్లో నీటిని శుద్ధి చేసినా ఫలితం లేకుండా పోతుందని ప్రజలు చెబుతున్నారు. పైపులు మరమత్తుకు వచ్చి వారాలు గడుస్తున్నా సరి చేయడం లేదని ప్రజలంటున్నారు. ప్రస్తుతం అందజేస్తున్న తాగునీరు మూడు రోజులకు ఒక్కసారి వస్తున్నాయని తిరువూరు ప్రజలు చెబుతున్నారు. అందజేస్తున్న మంచినీరు ప్రజల అవసరాలకు సరిపోవడం లేదని వాపోతున్నారు.

162 కోట్లతో కృష్ణా జలాలను తిరువూరు ప్రజలకు అందించాలని తలపెట్టిన మంచినీటి ప్రాజెక్టు పూర్తికాకపోవడంతో తిరువూరు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రోజుల్లో తాగునీరులేక మరిన్ని ఇబ్బందులు పడతామని ప్రజలంటున్నారు. 2019 ఎన్నికలు ముగిసాకైనా ప్రభుత్వం తమకు తాగునీరు అందిస్తుందని తిరువూరు ప్రజలు ఆశపడ్డారు. పనులు ప్రారంభించి సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ తాగునీరు అందించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశాన్ని తిరువూరు నగర పంచాయితీ అధికారులకు అడగ్గా పనులు జరుగుతున్నాయని, త్వరలోనే ఇంటింటికి తాగు నీరు అందిస్తామని చెబుతున్నారు. ప్రస్తుతం తిరువూరు నగరంలో ఓ నీటి ట్యాంక్ శిథిలావస్థకు చేరుకుంది. దాని పక్కనే నూతన వాటర్ ట్యాంక్ నిర్మిస్తున్నారు. ఇంటింటికి మంచినీరు అందించాలంటే మరో రెండు నీటి ట్యాంక్ లు నిర్మించాలి. ఆ ట్యాంకుల పనులు నేటికీ ప్రారంభించలేదు.

వేసవి సమీపిస్తుండడంతో త్వరగా మంచినీటి సరఫరా ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసి తమకు మంచినీటిని అందించాలని తిరువూరు ప్రజలు కోరుతున్నారు. తాగునీటిని అందించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడమేంటని ప్రశ్నిస్తున్నారు.

వేసవికాలం రాకమునుపే తాగునీటీ సమస్య..

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.