ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడే అవినీతి తగ్గుతుందని ఏసీబీ డీఎస్పీ నాగభూషణం అన్నారు. ప్రపంచ అవినీతి నిరోధక దినోత్సవం సందర్భంగా కర్నూలులో స్థానిక యువత అవినీతికి వ్యతిరేకంగా ప్రదర్శన చేపట్టారు. ఈ ప్రదరర్శనను ఏసీబీ డీఎస్పీ నాగభూషణం ప్రారంభించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి ర్యాలీ కొనసాగింది. ఎవరైన లంచం అడిగితే అవినీతి నిరోధక శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని డీఎస్పీ తెలిపారు.
ఇదీ చదవండి: