ETV Bharat / state

ఆగివున్న ట్రాక్టర్​ను ఢీ కొట్టిన ద్విచక్రవాహనం.. ఇద్దరు మృతి

అతివేగం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్న ఘటన కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం తిమ్మనాయునిపేట సమీపంలో జరిగింది. ట్రాక్టర్​ను రోడ్డు పక్కన నిలిపి ఓ వ్యక్తి బాగుచేస్తున్నాడు. అంతలో ఓ ద్విచక్రవాహనం అతివేగంగా వచ్చి ఆగిఉన్న ట్రాక్టర్​ని, దాన్ని బాగుచేస్తున్న వ్యక్తిని ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనం నడిపిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. తన పని తాను చేసుకుంటున్న మరో వ్యక్తి సైతం ఆసుపత్రికి తరలిస్తుండగా మరణిచాడు.

author img

By

Published : Feb 18, 2021, 5:24 PM IST

two persons died in road accident
ఆగివున్న ట్రాక్టర్​ను ఢీకొన్న ద్విచక్రవాహనం

కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం తిమ్మనాయునిపేట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. తిమ్మనాయునిపేట వద్ద గోవింద్​ అనే వ్యక్తి ట్రాక్టర్ పంక్చర్ అయ్యింది. రోడ్డు పక్కకు వాహనం నిలిపి బాగుచేస్తున్నాడు. బి.ఉప్పులూరుకు చెందిన రవి.. ద్విచక్రవాహనంపై వచ్చి గోవింద్​ను బలంగా ఢీకొట్టాడు.

అదుపుతప్పి ఆగివున్న ట్రాక్టర్​ను సైతం ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రవి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రగాయాలైన గోవింద్​ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం తిమ్మనాయునిపేట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. తిమ్మనాయునిపేట వద్ద గోవింద్​ అనే వ్యక్తి ట్రాక్టర్ పంక్చర్ అయ్యింది. రోడ్డు పక్కకు వాహనం నిలిపి బాగుచేస్తున్నాడు. బి.ఉప్పులూరుకు చెందిన రవి.. ద్విచక్రవాహనంపై వచ్చి గోవింద్​ను బలంగా ఢీకొట్టాడు.

అదుపుతప్పి ఆగివున్న ట్రాక్టర్​ను సైతం ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రవి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రగాయాలైన గోవింద్​ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

తెలంగాణలో న్యాయవాద దంపతుల హత్యపై.. రాష్ట్రంలో నిరసనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.