ETV Bharat / state

జోహరాపురం వంతెన నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

జోహరాపురం వంతెన నిర్మాణ పనులను ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పరిశీలించారు. నిధుల కొరతతో వంతెన పనులు ఆగిపోయాయని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. నిధులు విడుదల చేసినట్లు ఎమ్మల్యే తెలిపారు.

author img

By

Published : Aug 13, 2020, 11:35 PM IST

mla hafiz khan
జోహరాపురం వంతెన నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

కర్నూలు అభివృద్ధికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్ని విధాల సహకరిస్తున్నారని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. నగరంలోని జోహరాపురం వద్ద హంద్రీ నది వంతెన నిర్మాణ పనులను పరిశీలించారు. వంతెన నిర్మాణ పనులు ప్రారంభమై.. రెండు సంవత్సరాలు అయినా, నిధుల కొరతతో పనులు నిలిచిపోయాయన్నారు.

ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా.. 3 కోట్ల 30 లక్షల రూపాయల నిధులు విడుదల చేశారనీ.. ఇంకా 7 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాల్సి ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా వంతెన లేక జోహరాపురం వాసులు ఇబ్బందులు పడుతున్నారనీ.. త్వరలోనే వారి కష్టాలు తొలగనున్నాయని భరోసా ఇచ్చారు.

కర్నూలు అభివృద్ధికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్ని విధాల సహకరిస్తున్నారని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. నగరంలోని జోహరాపురం వద్ద హంద్రీ నది వంతెన నిర్మాణ పనులను పరిశీలించారు. వంతెన నిర్మాణ పనులు ప్రారంభమై.. రెండు సంవత్సరాలు అయినా, నిధుల కొరతతో పనులు నిలిచిపోయాయన్నారు.

ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా.. 3 కోట్ల 30 లక్షల రూపాయల నిధులు విడుదల చేశారనీ.. ఇంకా 7 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాల్సి ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా వంతెన లేక జోహరాపురం వాసులు ఇబ్బందులు పడుతున్నారనీ.. త్వరలోనే వారి కష్టాలు తొలగనున్నాయని భరోసా ఇచ్చారు.

ఇదీ చదవండి:

భాజపా ఎంపీ హెగ్డే క్షమాపణలు చెప్పాలి: బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.