కర్నూలు అభివృద్ధికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్ని విధాల సహకరిస్తున్నారని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. నగరంలోని జోహరాపురం వద్ద హంద్రీ నది వంతెన నిర్మాణ పనులను పరిశీలించారు. వంతెన నిర్మాణ పనులు ప్రారంభమై.. రెండు సంవత్సరాలు అయినా, నిధుల కొరతతో పనులు నిలిచిపోయాయన్నారు.
ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా.. 3 కోట్ల 30 లక్షల రూపాయల నిధులు విడుదల చేశారనీ.. ఇంకా 7 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాల్సి ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా వంతెన లేక జోహరాపురం వాసులు ఇబ్బందులు పడుతున్నారనీ.. త్వరలోనే వారి కష్టాలు తొలగనున్నాయని భరోసా ఇచ్చారు.
ఇదీ చదవండి: