ETV Bharat / state

నేటి నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

author img

By

Published : Mar 4, 2021, 6:46 AM IST

Updated : Mar 4, 2021, 7:00 AM IST

శ్రీశైలంలో నేటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టారు

Mahashivaratri Brahmotsavam in Srisailam from today
నేటి నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. శ్రీగిరి క్షేత్రాన్ని శోభాయమానంగా ముస్తాబు చేసి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. ప్రవేశ మార్గాల వద్ద స్వాగత తోరణాలు, షామియానాలు ఏర్పాటు చేశారు. ఆలయ క్యూలైన్లను సిద్ధం చేశారు. . ఈ రోజు ఉదయం 9.45 గంటలకు దేవస్థానం ఈఓ కె.ఎస్. రామారావు, అర్చకులు యాగశాల ప్రవేశం చేసి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ సందర్భంగా శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామివార్ల దేవాలయాలను విద్యుద్దీపాలంకరణలతో ముస్తాబు చేశారు

నేటి నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

సాయంత్రం సకల దేవతలను ఆహ్వానిస్తూ ప్రధాన ధ్వజస్తంభం పై ధ్వజ పటాన్ని ఆవిష్కరించనున్నారు.బ్రహ్మోత్సవాల ప్రారంభం కానుండడంతో శివ దీక్షలు ధరించిన భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. శివ నామ స్మరణ చేసుకుంటూ భక్తులు పాదయాత్రగా శ్రీగిరికి చేరుతున్నారు.

ఇదీ చూడండి:

సరస్వతీదేవి అలంకారంలో హంసవాహనంపై ఊరేగిన స్వామివారు

ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. శ్రీగిరి క్షేత్రాన్ని శోభాయమానంగా ముస్తాబు చేసి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. ప్రవేశ మార్గాల వద్ద స్వాగత తోరణాలు, షామియానాలు ఏర్పాటు చేశారు. ఆలయ క్యూలైన్లను సిద్ధం చేశారు. . ఈ రోజు ఉదయం 9.45 గంటలకు దేవస్థానం ఈఓ కె.ఎస్. రామారావు, అర్చకులు యాగశాల ప్రవేశం చేసి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ సందర్భంగా శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామివార్ల దేవాలయాలను విద్యుద్దీపాలంకరణలతో ముస్తాబు చేశారు

నేటి నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

సాయంత్రం సకల దేవతలను ఆహ్వానిస్తూ ప్రధాన ధ్వజస్తంభం పై ధ్వజ పటాన్ని ఆవిష్కరించనున్నారు.బ్రహ్మోత్సవాల ప్రారంభం కానుండడంతో శివ దీక్షలు ధరించిన భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. శివ నామ స్మరణ చేసుకుంటూ భక్తులు పాదయాత్రగా శ్రీగిరికి చేరుతున్నారు.

ఇదీ చూడండి:

సరస్వతీదేవి అలంకారంలో హంసవాహనంపై ఊరేగిన స్వామివారు

Last Updated : Mar 4, 2021, 7:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.