ETV Bharat / state

'సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయించాలి'

author img

By

Published : Nov 15, 2020, 7:42 PM IST

కర్నూలు జిల్లా నంద్యాలలో సామూహిక ఆత్మహత్య చేసుకున్న సలాం కుటుంబసభ్యులను సీపీఐ రామకృష్ణ పరామర్శించారు. కుటుంబం బలవన్మరణ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

cpi ramakrishna visit salam family
సలాం కుటుంబసభ్యులకు సీపీఐ రామకృష్ణ పరామర్శ

అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై సీబీఐతో విచారణ చేయించాలని సీపీఐ రామకృష్ణ డిమాండ్ చేశారు. అది సాధ్యం కాకుంటే జ్యుడీషియల్ విచారణ చేపట్టాలన్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో సలాం కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు.

సలాం బంధువులకు అండగా ఉంటామని రామకృష్ణ ధైర్యం చెప్పారు. సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్​లను వెంటనే డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. సలాం కుటుంబానికి న్యాయం జరగకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై సీబీఐతో విచారణ చేయించాలని సీపీఐ రామకృష్ణ డిమాండ్ చేశారు. అది సాధ్యం కాకుంటే జ్యుడీషియల్ విచారణ చేపట్టాలన్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో సలాం కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు.

సలాం బంధువులకు అండగా ఉంటామని రామకృష్ణ ధైర్యం చెప్పారు. సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్​లను వెంటనే డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. సలాం కుటుంబానికి న్యాయం జరగకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

ఇవీ చదవండి..

రేపటినుంచి రాష్ట్రవ్యాప్తంగా గృహ ప్రవేశాల కార్యక్రమం: సీపీఐ రామకృష్ణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.