కర్నూలు నగరంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న జోహరాపురం వారథిని వెంటనే పూర్తి చేయాలని భాజపా-జనసేన నాయకులు డిమాండ్ చేశారు. ఈ వంతెన పూర్తి కాకపోవటం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని... జనసేనాని పవన్ కల్యాణ్ సైతం దీనిని పరిశీలించినట్లు గుర్తు చేశారు. వెంటనే వంతెనను పూర్తి చేయాలని లేదంటే... స్థానిక ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఇవీ చదవండి: రాష్ట్రంలో ఆరు నెలల తర్వాత తెరుచుకున్న పాఠశాలలు