రాష్ట్ర ప్రభుత్వం నూతన వాహన చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ కర్నూలులో కలెక్టర్ కార్యాలయం ముందు ఆటో కార్మికులు నిరసన తెలిపారు. నేను విన్నాను ... నేను ఉన్నాను అని ఆటో డ్రైవర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదివేల రూపాయాలు ఇచ్చి.. జరిమానాల పేరుతో లక్షల రూపాయలు తిరిగి తీసుకుంటున్నారన్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే కొత్త వాహన చట్టాన్ని రద్దు చెయ్యని పక్షంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
ఇవీ చదవండి: కబ్జా కొరల్లో నాగుల చెరువు