ETV Bharat / state

ప్రభుత్వ ప్రోత్సాహకం...క్రీడాకారుల్లో నూతనోత్తేజం

2014 నుంచి జాతీయస్థాయి క్రీడల్లో పతకాలు సాధించిన వారికి ప్రోత్సాహకాలు అందించనున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి ప్రకటించడంపై.. క్రీడాకారులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఈ నిర్ణయం క్రీడాకారుల్లో నూతనోత్తేజాన్ని కలిగిస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక స్తోమత లేని కారణంగా వెలుగులోకి రాలేకపోతున్న ఎంతో మంది క్రీడాకారులకు..ఈ ప్రోత్సాహకాలు ప్రయోజనకరంగా ఉంటాయని శిక్షకులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

author img

By

Published : Aug 29, 2019, 5:41 AM IST

ప్రభుత్వ ప్రోత్సాహకాలు...క్రీడాకారుల్లో నూతనోత్తేజం
ప్రభుత్వ ప్రోత్సాహకం...క్రీడాకారుల్లో నూతనోత్తేజం

క్రీడల్లో రాణిస్తున్న క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ ముఖ్యమంత్రి జగన్‌ తీసుకున్న నిర్ణయం.. క్రీడారంగంలో నూతనోత్తేజాన్ని తీసుకువస్తుందని క్రీడాకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అద్భుతంగా రాణించే సత్తా ఉన్నా.. ఆర్థిక స్తోమత లేక మరుగున పడుతున్న యువ క్రీడాకారులకు.. ప్రభుత్వం అందించే ప్రోత్సాహకం భరోసాను కల్పిస్తుందంటున్నారు. ఈ నిర్ణయంతో తలిదండ్రులు తమ పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహిస్తారని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. ఏటా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని, ప్రతిభవంతులను ప్రోత్సహించే బాధ్యత ఇకపై ప్రభుత్వం తీసుకుంటుందని.. సీఎం ప్రకటించడం శుభపరిణామంగా అభివర్ణిస్తున్నారు. వర్థమాన క్రీడాకారులకు ఈ పరిణామం ప్రయోజనకరంగా ఉంటుందని.. పలువురు క్రీడాకారులు, అకాడమీ నిర్వాహకులు చెబుతున్నారు.

ప్రభుత్వ నిర్ణయంపై క్రీడాకారులతోపాటు, క్రీడా సంఘాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. నగదు ప్రోత్సాహకాలు అందించడం ద్వారా భవిష్యత్‌ యువ క్రీడాకారులకు భరోసా కల్పించినట్లు అవుతుందంటున్నారు. ఇంతకు ముందు ప్రభుత్వాలూ క్రీడాకారులకు అనేక హామీలిచ్చాయని.. కానీ వాటి అమలులో కచ్చితంగా వ్యవహరించలేదని తల్లిదండ్రులు, శిక్షకులు చెబుతున్నారు. ఇప్పటికైనా అర్హులకు ప్రోత్సాహకాలు అందేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి :

'ఇది ఆరంభమే... ఇకపై అంతకుమించి'

ప్రభుత్వ ప్రోత్సాహకం...క్రీడాకారుల్లో నూతనోత్తేజం

క్రీడల్లో రాణిస్తున్న క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ ముఖ్యమంత్రి జగన్‌ తీసుకున్న నిర్ణయం.. క్రీడారంగంలో నూతనోత్తేజాన్ని తీసుకువస్తుందని క్రీడాకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అద్భుతంగా రాణించే సత్తా ఉన్నా.. ఆర్థిక స్తోమత లేక మరుగున పడుతున్న యువ క్రీడాకారులకు.. ప్రభుత్వం అందించే ప్రోత్సాహకం భరోసాను కల్పిస్తుందంటున్నారు. ఈ నిర్ణయంతో తలిదండ్రులు తమ పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహిస్తారని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. ఏటా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని, ప్రతిభవంతులను ప్రోత్సహించే బాధ్యత ఇకపై ప్రభుత్వం తీసుకుంటుందని.. సీఎం ప్రకటించడం శుభపరిణామంగా అభివర్ణిస్తున్నారు. వర్థమాన క్రీడాకారులకు ఈ పరిణామం ప్రయోజనకరంగా ఉంటుందని.. పలువురు క్రీడాకారులు, అకాడమీ నిర్వాహకులు చెబుతున్నారు.

ప్రభుత్వ నిర్ణయంపై క్రీడాకారులతోపాటు, క్రీడా సంఘాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. నగదు ప్రోత్సాహకాలు అందించడం ద్వారా భవిష్యత్‌ యువ క్రీడాకారులకు భరోసా కల్పించినట్లు అవుతుందంటున్నారు. ఇంతకు ముందు ప్రభుత్వాలూ క్రీడాకారులకు అనేక హామీలిచ్చాయని.. కానీ వాటి అమలులో కచ్చితంగా వ్యవహరించలేదని తల్లిదండ్రులు, శిక్షకులు చెబుతున్నారు. ఇప్పటికైనా అర్హులకు ప్రోత్సాహకాలు అందేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి :

'ఇది ఆరంభమే... ఇకపై అంతకుమించి'

Intro:Ap_Rjy_81_28_telugu_dinotsavam_Sandart_AV_AP10107

()తెలుగు భాషా దినోత్సవం పురస్కరించుకొని తూర్పుగోదావరి జిల్లా రంగంపేట లో సైకతశిల్పి దేవిన శ్రీనివాస్ సైకత శిల్పన్ని రూపొందించారు .. తెలుగును ప్రేమిద్దాం, తెలుగు భాషను కాపాడుదాంఅన్న నినాదాలతో అ అక్షరాన్ని రెండు చేతులతో ఒడిసి పట్టుకున్నట్టుగా , ఒక పక్క తెలుగు భాష వ్యవహారిక పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు మరో పక్క వేదాలను పూర్తిగా తెలుగులోకి అనువదించిన దాశరథి రంగాచార్యల రూపాలను రూపొందించారు. ఈ సైకత శిల్పాన్ని చూడటానికి అధిక సంఖ్యలో గ్రామస్థులు తరలి వచ్చారు.

VISUALS...Body:Ap_Rjy_81_28_telugu_dinotsavam_Sandart_av_AP10107Conclusion:Ap_Rjy_81_28_telugu_dinotsavam_Sandart_av_AP10107

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.