ETV Bharat / state

అక్రమ మద్యం పట్టివేత..నిందితులు అరెస్టు

author img

By

Published : Jun 22, 2020, 7:27 PM IST

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పరిధిలోని గరికపాడు చెక్​పోస్టు వద్ద తెలంగాణ నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. 1,020 మద్యం సీసాలను స్వాధీం చేసుకొని వాహనాలు సీజ్ చేశారు.

అక్రమ మద్యం పట్టివేత..నిందితులు అరెస్టు !
అక్రమ మద్యం పట్టివేత..నిందితులు అరెస్టు !

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పరిధిలోని గరికపాడు చెక్​పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. టాటా ఏస్​ వాహనంలో తరలిస్తున్న 1,020 మద్యం బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ 1 లక్షా 20 వేలు ఉంటుందని అడిషనల్​ ఎస్పీ శ్రీవకుల్ జిందాల్ స్పష్టం చేశారు. నిందితులను అదుపులోకి తీసుకొని వారిపై కేసులు నమోదు చేశామన్నారు.

జిల్లాలో అక్రమ మద్యం, అక్రమ ఇసుక రవాణా, నిషేధిత గుట్కా వంటి వాటిపై ప్రత్యేక నిఘా పెట్టామని ఏఎస్పీ స్పష్టం చేశారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పరిధిలోని గరికపాడు చెక్​పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. టాటా ఏస్​ వాహనంలో తరలిస్తున్న 1,020 మద్యం బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ 1 లక్షా 20 వేలు ఉంటుందని అడిషనల్​ ఎస్పీ శ్రీవకుల్ జిందాల్ స్పష్టం చేశారు. నిందితులను అదుపులోకి తీసుకొని వారిపై కేసులు నమోదు చేశామన్నారు.

జిల్లాలో అక్రమ మద్యం, అక్రమ ఇసుక రవాణా, నిషేధిత గుట్కా వంటి వాటిపై ప్రత్యేక నిఘా పెట్టామని ఏఎస్పీ స్పష్టం చేశారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.