ETV Bharat / state

పెరిగిన పెట్రో ధరలను తగ్గించాలంటూ విజయవాడలో నిరసన

author img

By

Published : Jun 29, 2020, 4:42 PM IST

రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలంటూ విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేశారు. ముఖ్యమంత్రి స్పందించి.. ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నాయకులు కోరారు.

Vijayawada protests over price hike of petrol and diesel
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలంటూ విజయవాడలో నిరసన

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. విజయవాడ ఆంధ్రరత్న భవన్​లో కాంగ్రెస్​ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించేలా ప్రభుత్వం కృషి చేయాలని ఏఐసీసీ సభ్యులు నరహరశెట్టి నరసింహారావు అన్నారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు రవాణా రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయన్నారు. రాష్ట్రం నుంచి 25 మంది ఎంపీలున్నా ఇంధనం ధరలు తగ్గించేందుకు ఒక్కరూ కృషి చేయకపోవడం శోచనీయమన్నారు. తక్షణమే ముఖ్యమంత్రి జగన్​మోహన్​రెడ్డి స్పందించి ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. విజయవాడ ఆంధ్రరత్న భవన్​లో కాంగ్రెస్​ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించేలా ప్రభుత్వం కృషి చేయాలని ఏఐసీసీ సభ్యులు నరహరశెట్టి నరసింహారావు అన్నారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు రవాణా రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయన్నారు. రాష్ట్రం నుంచి 25 మంది ఎంపీలున్నా ఇంధనం ధరలు తగ్గించేందుకు ఒక్కరూ కృషి చేయకపోవడం శోచనీయమన్నారు. తక్షణమే ముఖ్యమంత్రి జగన్​మోహన్​రెడ్డి స్పందించి ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీచదవండి: కరోనా భయం: వృద్ధురాలి అంత్యక్రియలు అడ్డుకున్న స్థానికులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.