ETV Bharat / state

లాక్​డౌన్​ ఎఫెక్ట్: ఆరుగాలం పడిన కష్టం ఆవిరైపోతోంది

author img

By

Published : Apr 10, 2020, 6:18 PM IST

లాక్​డౌన్ కారణంగా కూరగాయల పంటలన్నీ తోటల్లోనే పాడైపోతున్నాయి. కోసేందుకు కూలీలు లేని పరిస్థితుల్లో.. కుటుంబసభ్యులతో కలిసి పంటను కోసినా కూడా.. మార్కెట్​కు తరలించేందుకు వాహనాలు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.

vegitables farmers problems in krishna dst
ఆరుగాలం పడిన కష్టం ఆవిరైపోతోంది

కరోనా ప్రభావానికి ఉద్యాన, వాణిజ్య పంటల రైతులు కుదేలవుతున్నారు. ఊహకు అందని ఉపద్రవం చుట్టుముట్టడంతో దిక్కుతోచని పరిస్థితులో సాగుదారులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. సాగు కోసం చేసిన అప్పులు తీర్చాలంటూ రుణదాతల ఒత్తిళ్లు ఒకవైపు... పండిన పంటను ఏం చేయాలో తెలియని పరిస్థితి మరోవైపు రైతులను కుంగీదీస్తోంది. ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకుని పండిచిన పంట చేతికొచ్చే దశలో ఇలాంటి నష్టాన్ని మిగిల్చడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. గ్రామాల వారీగా స్థితిగతులను ప్రభుత్వం పరిశీలించి- తమకు ఉపశమన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చూడండి:

కరోనా ప్రభావానికి ఉద్యాన, వాణిజ్య పంటల రైతులు కుదేలవుతున్నారు. ఊహకు అందని ఉపద్రవం చుట్టుముట్టడంతో దిక్కుతోచని పరిస్థితులో సాగుదారులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. సాగు కోసం చేసిన అప్పులు తీర్చాలంటూ రుణదాతల ఒత్తిళ్లు ఒకవైపు... పండిన పంటను ఏం చేయాలో తెలియని పరిస్థితి మరోవైపు రైతులను కుంగీదీస్తోంది. ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకుని పండిచిన పంట చేతికొచ్చే దశలో ఇలాంటి నష్టాన్ని మిగిల్చడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. గ్రామాల వారీగా స్థితిగతులను ప్రభుత్వం పరిశీలించి- తమకు ఉపశమన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చూడండి:

ఆ ప్రాంతంలో గబ్బిలాలకు పూజ.. ఎందుకంటే?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.