- మదర్స్డే స్పెషల్: ఈరోజు అమ్మకు ఏమిస్తున్నారు?
అమ్మ ఓ సహజ రోబో. తెల్లవారక ముందే పనులతో మొదలైన కుస్తీ రాత్రి వరకూ కొనసాగుతూనే ఉంటుంది. వంటపని, ఇంటిపని, పిల్లల సంరక్షణ, భర్త బాగోగులు.. ఇవన్నీ సమర్థించుకోవాలి. అలా గడియారంతో పోటీ పడుతూ ఉండే అమ్మను ఎప్పుడూ ప్రత్యేకంగానే చూసుకోవాలి. ఈరోజు ఆమెను మరింత ప్రత్యేకంగా చూడాలి. ఎందుకంటే.. అంతర్జాతీయ మాతృదినోత్సవం ఇవాళే! మరి అమ్మ కోసం ఏం చేయచ్చో చూడండి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అమ్మ కోసం అక్షరాలే అలంకారాలైతే!
అమ్మ ప్రేమను వివరించడానికి లోకంలో ఏ భాష సరిపోదు. అదే విధంగా ప్రతి మనిషి తన జీవితంలో అమ్మ ప్రాధాన్యాన్ని సరిపోల్చనూ లేరు. అమ్మ అంటేనే కమ్మదనం. ఆ కమ్మదనాన్ని మన తెలుగు పదాలతో రంగరించి ఎన్నో పాటలను అందించారు మన టాలీవుడ్ గేయ రచయితలు. కానీ, అమ్మ గురించి చెప్పడానికి ఏ పాట, ఏ భావం సరిపోదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బోరుబావిలో గున్న ఏనుగు- స్థానికుల సహాయంతో బయటకు
ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిన గున్న ఏనుగును గ్రామస్థుల సాయంతో సురక్షితంగా బయటకు తీశారు అటవీ అధికారులు. గజరాజును మనిషి తాకకూడదనే అక్కడి సంప్రదాయాన్ని పాటిస్తూ.. చాకచక్యంగా వ్యవహరించి కాపాడారు. అనంతరం.. అడవిలోకి తరలించారు. ఈ ఘటన బంగాల్లోని ఝూడ్గ్రామ్లో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రాత్రి కర్ఫ్యూ పర్యవేక్షణకు.. వీధుల్లో తిరిగిన సీఎం
అగర్తలాలో కర్ఫ్యూ నిబంధనలు ఏ మేరకు అమలు అవుతున్నాయో తెలుసుకునేందుకు స్వయంగా సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ స్థానిక వీధుల్లో తిరిగారు. అక్కడ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన సౌకర్యాలపై అధికారులతో చర్చించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కొవిడ్ కాలంలో.. చిన్న పరిశ్రమలకు చేయూత
కొవిడ్ కష్టకాలంలో చిన్న పరిశ్రమలకు చేయూతనిచ్చేందుకు రాష్ట్ర ఆర్థిక సంస్థ ముందుకొచ్చింది. రూ.500 కోట్ల రుణాలివ్వాలని నిర్ణయించింది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు రూ.76.13 కోట్ల రుణాలను మంజూరు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- జనాభా కట్టడిపై పిల్లో కక్షిదారుగా ఆరోగ్య శాఖ
జనాభా కట్టడికి ఇద్దరు సంతానం నిబంధన విధించటం సహా తగిన చర్యలు చేపట్టాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖను కక్షిదారుగా చేర్చేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. ఈ మేరకు పిటిషన్దారు పెట్టుకున్న అభ్యర్థనకు న్యాయస్థానం అంగీకారం తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కేన్సర్తో 'బో' మృతి- ఒబామా భావోద్వేగం
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పెంపుడు శునకం 'బో' క్యాన్సర్తో మరణించింది. ఈ వార్తను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు ఒబామా దంపతులు. బో.. పదేళ్లకు పైగా తమ కుటుంబానికి నిజమైన స్నేహితుడిలా ఉన్నాడని ఒబామా పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'కఠిన నిబంధనలతో ఒలింపిక్స్ నిర్వహణ సాధ్యమే!'
ఒలింపిక్స్కు ముందు టోక్యోలో నిర్వహించిన ఆసియా కాంటినెంటల్ క్వాలిఫయింగ్ రెగట్టా టోర్నీ ఎలా నిర్వహించారు? కొవిడ్ నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? వంటి విషయాలను భారత రోయింగ్ కోచ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఇస్మాయిల్ పంచుకున్నారు. ఆ విశేషాలు మీకోసం.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'స్టాక్స్'లో పెట్టుబడులకు ఇది సరైన సమయమేనా?
ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో స్టాక్ మార్కెట్ సూచీలు తీవ్ర ఒడుదొడుకుల్లో ఉంటున్నాయి. ఒకరోజు భారీగా పడిపోతున్నాయి. మరోరోజు లాభాలను చూస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడులు పెట్టొచ్చా? పెడితే ఏ రంగానికి చెందిన కంపెనీలను ఎంచుకోవాలి ? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బాలయ్య కొత్త చిత్రంలో నటి మీనా!
నటసింహం బాలకృష్ణ-దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబోలో రానున్న చిత్రాన్ని నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించనున్నారు. ఇటీవలే దీనికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ వర్క్ ప్రారంభమైంది. ఈ సినిమాలో ఓ కీలకపాత్ర కోసం నటి మీనాను సంప్రదించినట్లు టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.