ETV Bharat / state

ఇల్లు కొంటానని వచ్చి.. రివాల్వర్​తో బెదిరించి..!

author img

By

Published : Oct 19, 2020, 6:03 PM IST

గుడివాడలో దుండగులు హైటెక్ చోరీకి పాల్పడుతున్నారు. ఇల్లు కొనుగోలు చేస్తానని వచ్చి వృద్ధిరాలిని రివాల్వర్​తో బెదిరించారు. 9 కాసుల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Thieves stole gold
Thieves stole gold

ఇల్లు కొనుగోలు చేస్తానంటూ వచ్చి వృద్ధురాలిని రివాల్వర్​తో బెదిరించి హైటెక్ చోరీ చేసిన ఉదంతం కృష్ణా జిల్లా గుడివాడలో చోటు చేసుకుంది. గుడివాడ కాకతీయ నగర్‌లో అమ్మకానికి పెట్టిన ఇంటిని కొనుగోలు చేస్తానంటూ వచ్చి.. ఇంటిలో ఒంటరిగా ఉంటున్న మహిళ వద్ద నుండి బంగారు ఆభరణాలు దోచుకెళ్లాడు.

దాదాపు 9 కాసుల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు బాధిత వృద్ధురాలు తెలిపారు. చోరీ జరిగిన ప్రాంతం గుడివాడ శివారు కావడంతో.. పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న వన్ టౌన్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇల్లు కొనుగోలు చేస్తానంటూ వచ్చి వృద్ధురాలిని రివాల్వర్​తో బెదిరించి హైటెక్ చోరీ చేసిన ఉదంతం కృష్ణా జిల్లా గుడివాడలో చోటు చేసుకుంది. గుడివాడ కాకతీయ నగర్‌లో అమ్మకానికి పెట్టిన ఇంటిని కొనుగోలు చేస్తానంటూ వచ్చి.. ఇంటిలో ఒంటరిగా ఉంటున్న మహిళ వద్ద నుండి బంగారు ఆభరణాలు దోచుకెళ్లాడు.

దాదాపు 9 కాసుల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు బాధిత వృద్ధురాలు తెలిపారు. చోరీ జరిగిన ప్రాంతం గుడివాడ శివారు కావడంతో.. పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న వన్ టౌన్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

నాణ్యతతో పాటు ఇసుక ధర తక్కువగా ఉండాలి: సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.