విజయవాడ మూడో డివిజన్ తెలుగుదేశం అభ్యర్థి కొందపనేని వాణిపై గుణదలలో జరిగిన దాడిపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు మహిళపై జరిగిన దాష్టీకాన్ని ఆయున ఖండించారు. రాష్ట్రంలో మహిళ సాధికారత దుస్థితికి వైకాపా పాలన నిదర్శనమని అసంతృప్తి వ్యక్తం చేశారు.
వైకాపా దాడి..
తెదేపా అభ్యర్థి కొందపనేని వాణిపై గుణదలలో దాడి జరిగింది. వైకాపా వర్గీయులు తనపై దాడి చేశారని బాధితురాలు వాణి ఠాణాలో ఫిర్యాదు చేశారు. సన్నిహితులతో కలిసి ప్రచారం చేస్తుండగా అధికార పార్టీకి చెందిన అవినాష్ వర్గీయులు దాడి చేసినట్లు పేర్కొన్నారు. తమ కుమారుడ్ని కత్తితో పొడవబోతే స్థానికులు అడ్డుకున్నారని వాణి వివరించారు. అభ్యర్థిణిపై జరిగిన దాడిని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ బుద్దా సైతం ఖండించారు.
ఇదీ చదవండి