ETV Bharat / state

ముగిసిన పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తిరునాళ్లు

author img

By

Published : Mar 2, 2021, 4:35 PM IST

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో అత్యంత వైభవంగా జరిగిన శ్రీ తిరుపతమ్మ అమ్మవారి తిరునాళ్లు పూర్ణాహుతి కార్యక్రమంతో మగిశాయి. ఐదు రోజులపాటు సాగిన తిరునాళ్లకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

Tirupatamma Ammavari thirunallu
పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తిరునాళ్ల

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో జరుగుతున్న శ్రీ తిరుపతమ్మ అమ్మవారి తిరునాళ్లు నేటితో ముగిశాయి. ఐదు రోజులుగా అత్యంత వైభవంగా జరిగిన తిరునాళ్లు ఇవాళ జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంతో ముగిసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన అమ్మవారి కల్యాణోత్సవంలో ఆలయ ఈవో ఎన్​వీఎస్​ఎన్ మూర్తి, పలువురు వైకాపా నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

5 రోజుల పాటు వైభవంగా సాగిన ఈ తిరునాళ్లకు రాష్ట్రవ్యాప్తంగా భారీగా భక్తులు తరలివచ్చారు. ప్రత్యేక పూజలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు.

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో జరుగుతున్న శ్రీ తిరుపతమ్మ అమ్మవారి తిరునాళ్లు నేటితో ముగిశాయి. ఐదు రోజులుగా అత్యంత వైభవంగా జరిగిన తిరునాళ్లు ఇవాళ జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంతో ముగిసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన అమ్మవారి కల్యాణోత్సవంలో ఆలయ ఈవో ఎన్​వీఎస్​ఎన్ మూర్తి, పలువురు వైకాపా నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

5 రోజుల పాటు వైభవంగా సాగిన ఈ తిరునాళ్లకు రాష్ట్రవ్యాప్తంగా భారీగా భక్తులు తరలివచ్చారు. ప్రత్యేక పూజలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు.

ఇదీ చూడండి: ఎస్‌ఈసీ నిర్ణయంపై 4 లంచ్‌మోషన్‌ పిటిషన్లు.. విచారణకు స్వీకరించిన హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.