ETV Bharat / state

Sakambari Festival: 22 నుంచి ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు ఈ నెల 22 నుంచి 24 వరకు జరగనున్నాయి. ఉత్సవ నిర్వహణపై ఆలయ పాలక మండలి చైర్మన్ పైలా సోమినాయుడు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

author img

By

Published : Jul 14, 2021, 1:47 PM IST

Sakambari_utsav
విజయవాడ ఇంద్రకీలాద్రి

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈనెల 22 నుంచి 24 వరకు శాకంబరీ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవ నిర్వహణపై ఆలయ పాలక మండలి చైర్మన్ పైలా సోమినాయుడు సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా భక్తులు ఉత్సవాలు తిలకించేందుకు అనుమతించాలని నిర్ణయించారు. భక్తుల నుంచి కాయగూరలు విరాళంగా స్వీకరించాలని నిర్ణయించారు. భక్తుల నుంచి రాని కాయగూరలు కొనుగోలు చేయాలని ఛైర్మన్‌ సూచించారు.

శాకాంబరీ దేవి ఉత్సవ ఆహ్వాన పత్రికను పాలకమండలి చైర్మన్ సోమినాయుడు ఆవిష్కరించారు. ఆలయ ప్రధానార్చకులు మల్లేశ్వర శాస్త్రి, ఉప ప్రధాన అర్చకులు శంకర శాండీల్య , పాలకమండలి సభ్యులు ఎన్. సుజాత సహాయ కార్యనిర్వహణాధికారి రవీంద్ర ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆషాడ మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి పవిత్ర సారె సమర్పణ సందడిగా సాగుతోంది.

భక్తులు చీరలు, పూలు, పండ్లు, పసుపు, కుంకుమ, మిఠాయిలు ఇతర వస్తువులతో బృందాలుగా వస్తున్నారు. గుంటూరు నగరానికి చెందిన సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం పారాయణ బృందం సభ్యులు అమ్మవారికి సారె సమర్పించారు. అనంతరం మహా మండపంలో అమ్మవారి ఉత్సవమూర్తి వద్ద ఆలయ అర్చకులు పూజ చేసి భక్తబృందానికి ప్రసాదం అందించారు.

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈనెల 22 నుంచి 24 వరకు శాకంబరీ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవ నిర్వహణపై ఆలయ పాలక మండలి చైర్మన్ పైలా సోమినాయుడు సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా భక్తులు ఉత్సవాలు తిలకించేందుకు అనుమతించాలని నిర్ణయించారు. భక్తుల నుంచి కాయగూరలు విరాళంగా స్వీకరించాలని నిర్ణయించారు. భక్తుల నుంచి రాని కాయగూరలు కొనుగోలు చేయాలని ఛైర్మన్‌ సూచించారు.

శాకాంబరీ దేవి ఉత్సవ ఆహ్వాన పత్రికను పాలకమండలి చైర్మన్ సోమినాయుడు ఆవిష్కరించారు. ఆలయ ప్రధానార్చకులు మల్లేశ్వర శాస్త్రి, ఉప ప్రధాన అర్చకులు శంకర శాండీల్య , పాలకమండలి సభ్యులు ఎన్. సుజాత సహాయ కార్యనిర్వహణాధికారి రవీంద్ర ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆషాడ మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి పవిత్ర సారె సమర్పణ సందడిగా సాగుతోంది.

భక్తులు చీరలు, పూలు, పండ్లు, పసుపు, కుంకుమ, మిఠాయిలు ఇతర వస్తువులతో బృందాలుగా వస్తున్నారు. గుంటూరు నగరానికి చెందిన సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం పారాయణ బృందం సభ్యులు అమ్మవారికి సారె సమర్పించారు. అనంతరం మహా మండపంలో అమ్మవారి ఉత్సవమూర్తి వద్ద ఆలయ అర్చకులు పూజ చేసి భక్తబృందానికి ప్రసాదం అందించారు.

ఇదీ చదవండి:

rains: తెలంగాణలో వర్షాలకు.. కృష్ణా జిల్లాలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.