ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్: సచివాలయ ఉద్యోగులకు వర్క్​ ఫ్రం హోం

author img

By

Published : Jun 8, 2020, 7:10 PM IST

అమరావతి సచివాలయంలో పలు శాఖల ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఉత్తర్వులు జారీ చేశారు అధికారులు. సచివాలయంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న కారణంగా.. ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులంతా ఇవాల్టి నుంచి 14వ తేదీ వరకూ ఇంటి నుంచే పని చేయాలని స్పష్టం చేశారు.

ap sachivalayam
ap sachivalayam

అమరావతి సచివాలయంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఒక్కో ప్రభుత్వ శాఖ.. తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఆదేశాలు జారీ చేస్తోంది. తాజాగా.. పరిశ్రమల శాఖ.. తమ ఉద్యోగులను ఇంటి నుంచే విధులు నిర్వహించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలెవన్ ఉత్తర్వులు జారీ చేశారు.

సచివాలయంలో పని చేస్తున్న పరిశ్రమల శాఖ ఉద్యోగులంతా నేటి నుంచి 14వ తేదీ వరకూ ఇంటి నుంచే పనిచేయాలని స్పష్టం చేసింది. ఈ వారం రోజుల పాటు హోమ్ క్వారంటైన్ లో ఉండాల్సిందిగా ఉత్తర్వుల్లో సూచించారు. వర్క్ ఫ్రమ్ హోమ్ విధులు నిర్వహిస్తున్న సమయంలో ఉద్యోగులంతా ఫోన్ లో అందుబాటులో ఉండాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు.

అమరావతి సచివాలయంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఒక్కో ప్రభుత్వ శాఖ.. తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఆదేశాలు జారీ చేస్తోంది. తాజాగా.. పరిశ్రమల శాఖ.. తమ ఉద్యోగులను ఇంటి నుంచే విధులు నిర్వహించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలెవన్ ఉత్తర్వులు జారీ చేశారు.

సచివాలయంలో పని చేస్తున్న పరిశ్రమల శాఖ ఉద్యోగులంతా నేటి నుంచి 14వ తేదీ వరకూ ఇంటి నుంచే పనిచేయాలని స్పష్టం చేసింది. ఈ వారం రోజుల పాటు హోమ్ క్వారంటైన్ లో ఉండాల్సిందిగా ఉత్తర్వుల్లో సూచించారు. వర్క్ ఫ్రమ్ హోమ్ విధులు నిర్వహిస్తున్న సమయంలో ఉద్యోగులంతా ఫోన్ లో అందుబాటులో ఉండాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

ఆపరేషన్​ కరోనా: ఆ జిల్లాల్లో ఇంటింటి సర్వే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.