కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గ్రూప్-1 అధికారిణి మృతిచెందింది. జాతీయరహదారిపై ఆగిఉన్న యాసిడ్ లారీని... వెనుక నుంచి వచ్చిన కారు వేగంగా ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న గ్రూప్-1 ఆడిట్ ఆధికారిణి అన్నదాత రాగమంజీరపై యాసిడ్ పడి తీవ్రంగా గాయపడ్డారు. గొల్లపూడిలోని ఆంధ్ర ఆసుపత్రికి తరలిస్తుండగానే... మరణించారు. ప్రమాదంలో గాయపడిన కారు డ్రైవర్కు చికిత్స అందిస్తున్నారు. విశాఖ జిల్లా పెందుర్తికి చెందిన రాగమంజీర... ఇబ్రహీంపట్నం డైరెక్టరేట్ ఆఫ్ స్టేట్ ఆడిట్ కార్యాలయంలో అసిస్టెంట్ ఆడిటర్గా విధులు నిర్వహిస్తున్నారు.
ఇవీ చూడండి-ప్రకాశం జిల్లాలో దారుణం... పొలంలోకి నీళ్లొచ్చాయని హత్య!