ETV Bharat / state

పట్టుదలతో చదివాడు... బంగారు పతకాలు సాధించాడు

చదువుకోవాలనే తపన.. సాధించాలనే పట్టుదల.. నడవడికలో క్రమశిక్షణ వెరసి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కౌశిక్​ను పాలిటెక్నిక్​లో రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానంలో నిలిచేలా చేశాయి. ఈ సందర్భంగా విద్యార్థిని కళాశాల యాజమాన్యం రెండు బంగారు పతకాలతో కౌశిక్​ను ఘనంగా సత్కరించింది.

author img

By

Published : Aug 13, 2019, 11:17 PM IST

విద్యార్ఖికి బంగారు పతకం
విద్యార్ఖికి బంగారు పతకం

తూర్పుగోదావరి జిల్లా ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్​ విభాగానికి చెందిన విద్యార్థి కౌశిక్... 99.23 శాతం మార్కులతో పాలిటెక్నిక్​లో రాష్ట్ర స్థాయిలో ప్రథమస్థానంలో నిలిచాడు. అతడిని రెండు బంగారు పతకాలతో పాటు 20 వేల నగదు ప్రోత్సహకంతో కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు పాలిటెక్నిక్ కళాశాలలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి మాట్లాడుతూ.. పట్టుదల, క్రమశిక్షణ, సాధించాలనే తపనే తనకు విజయాన్ని సాధించిపెట్టిందన్నాడు.

విద్యార్ఖికి బంగారు పతకం

తూర్పుగోదావరి జిల్లా ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్​ విభాగానికి చెందిన విద్యార్థి కౌశిక్... 99.23 శాతం మార్కులతో పాలిటెక్నిక్​లో రాష్ట్ర స్థాయిలో ప్రథమస్థానంలో నిలిచాడు. అతడిని రెండు బంగారు పతకాలతో పాటు 20 వేల నగదు ప్రోత్సహకంతో కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు పాలిటెక్నిక్ కళాశాలలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి మాట్లాడుతూ.. పట్టుదల, క్రమశిక్షణ, సాధించాలనే తపనే తనకు విజయాన్ని సాధించిపెట్టిందన్నాడు.

ఇదీ చదవండి

ఇన్ఫోసిస్​ సుధామూర్తి సింప్లిసిటీ చూశారా?

Intro:FILE NAME : AP_ONG_41_13_CHIRALA_MAHATMA_GANDHI_PKG_VISU_AP10068_SD
CONTRIBUTOR : K.NAGARAJU,CHIRALA(PRAKASAM)
యాంకర్ వాయిస్ : సత్యాన్ని ఆయుధంగా చేసుకున్న బాపూజీ బ్రిటిష్ వాళ్ళను గడగడ లాడించటంతో భారతదేశానికి స్వాతంత్య్రం సిద్దించింది... సత్యం అహింస ...ప్రాణాలను లెక్కచేయకపోవటం ఒక్కో చినుకు గాలివానలా మారినట్లు ఆయన ఒక్కో అడుగు బ్రిటీష్ సామ్రాజ్యగొడలు బీటలువారేలా చేశాయి... అహింసమార్గంలో ప్రజలందరినీ తీసుకొచ్చి స్వేచ్ఛ వాయువులు పీల్చేలా గాంధీజీ చేశారు.... అప్పుడే ప్రకాశం జిల్లా చీరాల, వేటపాలెం ప్రాంతాల్లో జాతిపిత గాంధీజీ పర్యటించారు... ఆయన తిరుగాడిన నేల చరిత్రకు సాక్ష్యాలుగా ఉన్నాయి...

వాయిస్ ఓవర్ : ప్రకాశం జిల్లా చీరాల పోరాటాల పురిటిగడ్డ... స్వాతంత్రోద్యమం ఊపందుకున్న రోజులు.. బిటిష్ పాలకులు పన్నులు కట్టమని హుకుం జారిచేశారు... పన్నులు కట్టే ప్రశక్తి లేదని... ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య చీరాల,పేరాల ఉద్యమం సాగించారు... పన్నులు కట్టేదిలేదని ఊరు కాళీ చేసి చీరాల సమీపంలో గుడిశెలు వేసుకుని సామూహిక వంటలు చేసుకుని దుగ్గిరాల గోపాలకృష్ణయ్య అద్వర్యంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా నిరశనలు తెలిపారు... విషయం తెలుసుకున్న గాంధీజీ వచ్చి చీరాల శివాలయం ప్రాంతంలో సమావేశం ఏర్పాటు చేసారు..గాంధీ సమావేశానికి వేలాదిమంది హాజరయ్యారు... సమావేశం ప్రదేశంలో గుర్తుగా నల్ల రంగులో ఉండే గాంధీ విగ్రహం ఏర్పాటు చేసారు... ప్రస్తుతం ఇప్పుడు అది చీరాల పట్టణంలో నల్లగాంధీ కూడలిగా ఉంది.... జాతిపిత మహాత్మా గాంధీ 1929,1935 వ సంవత్సరాల్లో రెండు సార్లు చీరాల ప్రాంతానికి వచ్చారు.... 1918 వ సంవత్సరంలో వేటపాలెం లో సారస్వతనికేతన్ ను వి.వి శ్రేష్టి ఏర్పాటుచేశారు...ఆతరువాత.. 1929 వసంవత్సరంలో చీరాల, వేటపాలెం పర్యటనకు వచ్చిన మహాత్మా గాంధీజి నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు... ఆసమయంలో గాంధీని చూసేందుకు అధికసంఖ్యలో ప్రజలు తండోపతండాలుగా వచ్చారు.... తొక్కిసలాట జరిగింది... దీంతో గాంధీజీ చేతి కర్ర విరిగిపోయింది... దీంతో ఆకర్రను వదిలివెళ్లారు... ఇప్పటికి అది గ్రంధాలయంలో బద్రంగా ఉంది... గాంధీ స్వదస్తూరితో గ్రంధాలయం గురించి రాసి సంతకం పెట్టారు... మొత్తం గ్రంధాలయంలో తాళపత్రగ్రంధాలతో కలిపి లక్ష వరకు పుస్తకాలున్నాయి... భారతభగవతం, పంచతంత్రం, గాంధీ జీవిత చరిత్రకు సంబంధించిన వందకు పైగా పుస్తకాలున్నాయి..ఇంతేకాక 1940 వ వంవత్సరం నుండి ఆంధ్రపత్రిక,ఆంధ్రప్రభ దినపత్రికలు ఇప్పటివరకు సజీవంగా ఉన్నాయి... స్వాతంత్ర్యం సిద్దించిన నాటి దినపత్రికలు ఇప్పటికి గ్రంధాలయంలో బద్రంగా ఉన్నాయి.. 1947 ఆగస్టు 15 స్వాతంత్య్రం వచ్చిన సందర్భముగా ఉన్న దినపత్రికలో వచ్చిన ... జయజయ ప్రియభారత.. జనయిత్రి దివ్య ధాత్రి.. అనే వ్యాసాన్ని ఇప్పటికి గ్రంధాలయాన్ని సందర్శించిన ప్రతిఒక్కరు చూస్తుంటారు... గాంధీ నడయాడిన నేలలో తాము పుట్టటం తమ అదృష్టమని వేటపాలెం వాసులు చెపుతున్నారు... స్వాత్యంత్రోద్యమ కాలంలో కీలకభూమిక పోషించిన గ్రంధాలయాన్ని దేశ నలుములలనుండి ఇప్పటికి పలువురు పరిశోధకులు సందర్శిస్తుంటారు... గ్రంధాలయ సిబ్బంది వచ్చిన ప్రతిఒక్కరికి సహకరించడం ఇక్కడి విశేషం.


Body:బైట్ : 1: శ్రీవల్లి - లైబ్రేరియన్,సారస్వత నికేయనం.వేటపాలెం.
బైట్ : 2 : జయలక్ష్మి, స్థానికురాలు.
బైట్ : 3 : సుజాత, ఉపాధ్యాయురాలు.
బైట్ : 4 : నాగమనోహర్ లోహియా, స్థానికుడు, వేటపాలెం.


Conclusion:కె.నాగరాజు,చీరాల,ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068,ఫోన్ : 9866931899
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.