రోజులాగే తన బిడ్డ ఆడుకుంటుందనే భ్రమలో ఉన్నారు ఆ తల్లిదండ్రులు. ఉన్నంటుండి ఏమైందో తెలియదు.... అంతా నిశ్శబ్దం. బయటికి వచ్చేసరికి తమ ముద్దుల చిన్నారి నీటితొట్టెలో విగతజీవిగా కనిపించేసరికి వారి రోధనలు మిన్నంటాయి. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో పెరికీడు గ్రామంలో జరిగింది.
కూలీ పనులు చేసుకుని జీవనం సాగించే మల్లవల్లీ ప్రకాష్కి ఇద్దరు పిల్లలు. మూడేళ్ల బాబు, ఏడాదిన్నర పాప. రోజు మాదిరిగా సాయంత్రం సుమారు 5.30 గంటల సమయంలో చిన్నారి ఆడుకుంటూ నీటి తొట్టిలో పడింది. చిన్నారిని ఎవరు చూడకపోవటంతో ఊపిరి ఆడక అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న హనుమాన్ జంక్షన్ ఎస్సై మదీనా బాషా.... తల్లిదండ్రులు నుంచి వివరాలు నమోదు చేసుకున్నారు.
ఇవీ చదవండి