కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ ప్రతిపాదించిన వన్ డిస్ట్రిక్ట్ - వన్ ప్రాడెక్టు పథకం దేశ ఆర్ధిక చక్రాన్ని పరుగులు పెట్టిస్తోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ భాగస్వామ్యం కీలకంగా మారుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ లో వివిధ భౌగిళిక ప్రాంతాల్లో ప్రపంచ గుర్తింపు పొందిన ఉత్పత్తులు చాలా ఉన్నాయని... జియోట్యాగింగ్ అయిన ఈ ఉత్పత్తులకు భారీ డిమాండ్ ఉంటుందని తెలిపారు. ఆత్మనిర్భర భారత్లో భాగంగా స్థానిక వస్తువులకు మార్కెటింగ్ కల్పించటమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు.
రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి ఒక వస్తువును ఎంచుకుని నాణ్యత, బ్రాండ్, విలువ పెంచి ఉత్పత్తి, ఉపాధి అవకాశాలను పెంచే దిశగా కార్యాచరణ చేపడతామని మంత్రి తెలిపారు.
ఇదీ చదవండి:
రాష్ట్రంలో అమ్మే మద్యం తాగితే 2, 3 ఏళ్లకే హరీ అంటారు: రఘురామకృష్ణరాజు