ETV Bharat / state

'మరణాలు తగ్గించడమే ధ్యేయంగా వైద్యులు, అధికారులు పనిచేయాలి' - collector intiaz conference with officers latest news

కరోనా ప్రబలుతున్న ప్రాంతాలను సంబంధిత అధికారులు గుర్తించి వారి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పడు పర్యవేక్షించాలని కలెక్టర్​ ఇంతియాజ్​ చెప్పారు. లాక్​డౌన్​ సడలింపుల కారణంగా ఈ నెలలో కరోనా పాజిటివ్​ కేసులు సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. తన క్యాంపు కార్యాలయం నుంచి రెవెన్యూ, వైద్య అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ చేశారు.

krishna district collector video conference with doctors and officers in his camp office
క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్​లో పాల్గొన్నకలెక్టర్​ ఇంతియాజ్​
author img

By

Published : Jun 8, 2020, 7:32 PM IST

కృష్ణా జిల్లాలో కరోనా వైరస్​ వల్ల సంభవించే మరణాలు తగ్గించడమే ధ్యేయంగా వైద్యులు, అధికారులు పనిచేయాలని కలెక్టర్​ ఇంతియాజ్​ అహ్మద్​ దిశానిర్దేశం చేశారు. లాక్​డౌన్​ సడలింపుల కారణంగా ఈ నెలలో పాజిటివ్​ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ విషయంపై రెవెన్యూ, వైద్య అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో ఆయన చర్చించారు.

విజయవాడలో పలు చోట్ల కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని... దీనికి తోడు ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ పరీక్షల నిర్వహణకు అనుమతిస్తున్నామని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఏఎన్​ఎమ్​లు, వాలంటీర్లు, ఆశా వర్కర్లు, వైద్యాధికారులు కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్న ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండి... అనుమానిత లక్షణాలున్న వారిని గుర్తించాలని చెప్పారు. కరోనా బారిన పడిన వ్యక్తులకు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా హోం ఐసోలేషన్​కు అనుమతించే వెసులుబాటు కల్పిస్తామని చెప్పారు.

కృష్ణా జిల్లాలో కరోనా వైరస్​ వల్ల సంభవించే మరణాలు తగ్గించడమే ధ్యేయంగా వైద్యులు, అధికారులు పనిచేయాలని కలెక్టర్​ ఇంతియాజ్​ అహ్మద్​ దిశానిర్దేశం చేశారు. లాక్​డౌన్​ సడలింపుల కారణంగా ఈ నెలలో పాజిటివ్​ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ విషయంపై రెవెన్యూ, వైద్య అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో ఆయన చర్చించారు.

విజయవాడలో పలు చోట్ల కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని... దీనికి తోడు ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ పరీక్షల నిర్వహణకు అనుమతిస్తున్నామని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఏఎన్​ఎమ్​లు, వాలంటీర్లు, ఆశా వర్కర్లు, వైద్యాధికారులు కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్న ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండి... అనుమానిత లక్షణాలున్న వారిని గుర్తించాలని చెప్పారు. కరోనా బారిన పడిన వ్యక్తులకు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా హోం ఐసోలేషన్​కు అనుమతించే వెసులుబాటు కల్పిస్తామని చెప్పారు.

ఇదీ చదవండి:

'ప్రతి ప్రయాణికుడికి పరీక్షలు తప్పనిసరి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.