లారీ, కారు ఢీ.. ఐదుగురికి తీవ్ర గాయాలు - latest updates in krishna
పండ్ల లోడుతో వస్తున్న లారీ, కారును ఢీకొని ఐదుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.

లారీ, కారును ఢీకొని ఐదుగురికి గాయాలు
కృష్ణా జిల్లా నూజివీడు మండలంలో లారీ, కారును ఢీకొన్న ఘటనలో ఐదుగురు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. మహారాష్ట్ర నుంచి దానిమ్మ పండ్ల లోడుతో వస్తున్న లారీ, చింతలపూడి నుంచి వస్తున్న కారును హనుమంతుల గూడెం వద్ద ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.