ఇదీ చదవండి :
పురుగులమందు డబ్బాలతో రైతుల ఆందోళన
కృష్ణా జిల్లా లక్ష్మీపురం గ్రామం సమీపంలో 216 జాతీయ రహదారి బైపాస్ రోడ్డు పక్కన రైతులు ఆందోళన చేశారు. తాము సాగుచేసుకునే భూములను చల్లపల్లి రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించగా... రైతులు అడ్డుకున్నారు. పురుగులమందు డబ్బాలతో పొలంలో బైఠాయించారు. ఎన్నో ఏళ్లుగా తమకు ఆసరాగా ఉన్న భూమిలో అధికారులు హద్దు రాళ్లు వేసేందుకు సిద్ధమయ్యారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ రికార్డుల్లో పోరంబోకు భూములుగా నమోదైనట్టు రెవెన్యూ అధికారులు తెలిపారు.
న్యాయం చేయాలంటూ పొలాల్లో కూర్చున్న రైతులు
ఇదీ చదవండి :