ETV Bharat / state

రాష్ట్రంలో పెరిగిన పోలింగ్ కేంద్రాలు

రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరగటంతో ఆ మేరకు పోలింగ్ కేంద్రాలనూ పెంచుతున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ప్రకటించారు.

author img

By

Published : Mar 31, 2019, 10:43 PM IST

రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాలను పెంచుతున్నట్లు ఈసీ వెల్లడి
రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాలను పెంచుతున్నట్లు ఈసీ వెల్లడి
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరగటంతో ఆ మేరకు పోలింగ్ కేంద్రాలనూ పెంచుతున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 45 వేల 920 పోలింగ్ కేంద్రాలున్నాయని... ఏప్రిల్ 11 న నిర్వహించే ఎన్నికల కోసం వీటిని 46 వేల 397కు పెంచుతున్నట్టు ద్వివేది స్పష్టం చేశారు. కృష్ణా జిల్లాలో అదనంగా మరో 121 పోలింగ్ కేంద్రాలు పెరిగాయని తెలిపారు. విజయనగరం జిల్లాలో ఒక్క పోలింగ్ కేంద్రం కూడా పెరగలేదని వివరించారు. ఇటీవల విడుదల చేసిన ఓటర్ల తుది జాబితా ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా... 3 కోట్ల 93 లక్షల 45 వేల 717 మంది ఓటర్లుగా నమోదు అయి ఉన్నారన్నారు. జనవరి 11న విడుదల చేసిన జాబితాతో పోలిస్తే ఈ సంఖ్య 25 లక్షలు ఎక్కువని ఆయన వివరించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాలను పెంచాల్సిన అవసరం వచ్చిందని వివరించారు. 25 లోక్ సభ స్థానాల్లో 344 మంది, 175 అసెంబ్లీ స్థానాల్లో 2395 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారని ద్వివేది వెల్లడించారు.

నియోజకవర్గాల వారీగా ఈవీఎంలపై ఉంచే బ్యాలట్ పేపర్ల ముద్రణ పూర్తి అయ్యిందని స్పష్టం చేశారు. విజయవాడ, కర్నూలులోని ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్​లో ముద్రించిన ఈ బ్యాలట్ పత్రాలను ఆయా ప్రాంతాలకు పంపుతున్నట్టు ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు. మరోవైపు ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక పోలీసు పరిశీలకులు కె.కె శర్మ సమీక్షించారని ద్వివేది తెలిపారు. ఎన్నికలకు ఎంత మంది భద్రతా సిబ్బంది అవసరం, ఇప్పటి వరకూ ఎన్ని కంపెనీలు వచ్చాయి... ఇంకా ఏమేరకు అవసరం అవుతారన్న అంశాలపై ఆరా తీశారని వివరించారు. అటు ఈవీఎంలు, వీవీప్యాట్​ల పనితీరుపై హైకోర్టు న్యాయమూర్తులకు ప్రదర్శన ఇస్తున్నట్టు ఈసీ వెల్లడించింది.

ఇవి చదవండి

రాష్ట్ర ఎన్నికల అధికారులతో కె.కె. శర్మ భేటీ

రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాలను పెంచుతున్నట్లు ఈసీ వెల్లడి
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరగటంతో ఆ మేరకు పోలింగ్ కేంద్రాలనూ పెంచుతున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 45 వేల 920 పోలింగ్ కేంద్రాలున్నాయని... ఏప్రిల్ 11 న నిర్వహించే ఎన్నికల కోసం వీటిని 46 వేల 397కు పెంచుతున్నట్టు ద్వివేది స్పష్టం చేశారు. కృష్ణా జిల్లాలో అదనంగా మరో 121 పోలింగ్ కేంద్రాలు పెరిగాయని తెలిపారు. విజయనగరం జిల్లాలో ఒక్క పోలింగ్ కేంద్రం కూడా పెరగలేదని వివరించారు. ఇటీవల విడుదల చేసిన ఓటర్ల తుది జాబితా ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా... 3 కోట్ల 93 లక్షల 45 వేల 717 మంది ఓటర్లుగా నమోదు అయి ఉన్నారన్నారు. జనవరి 11న విడుదల చేసిన జాబితాతో పోలిస్తే ఈ సంఖ్య 25 లక్షలు ఎక్కువని ఆయన వివరించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాలను పెంచాల్సిన అవసరం వచ్చిందని వివరించారు. 25 లోక్ సభ స్థానాల్లో 344 మంది, 175 అసెంబ్లీ స్థానాల్లో 2395 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారని ద్వివేది వెల్లడించారు.

నియోజకవర్గాల వారీగా ఈవీఎంలపై ఉంచే బ్యాలట్ పేపర్ల ముద్రణ పూర్తి అయ్యిందని స్పష్టం చేశారు. విజయవాడ, కర్నూలులోని ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్​లో ముద్రించిన ఈ బ్యాలట్ పత్రాలను ఆయా ప్రాంతాలకు పంపుతున్నట్టు ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు. మరోవైపు ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక పోలీసు పరిశీలకులు కె.కె శర్మ సమీక్షించారని ద్వివేది తెలిపారు. ఎన్నికలకు ఎంత మంది భద్రతా సిబ్బంది అవసరం, ఇప్పటి వరకూ ఎన్ని కంపెనీలు వచ్చాయి... ఇంకా ఏమేరకు అవసరం అవుతారన్న అంశాలపై ఆరా తీశారని వివరించారు. అటు ఈవీఎంలు, వీవీప్యాట్​ల పనితీరుపై హైకోర్టు న్యాయమూర్తులకు ప్రదర్శన ఇస్తున్నట్టు ఈసీ వెల్లడించింది.

ఇవి చదవండి

రాష్ట్ర ఎన్నికల అధికారులతో కె.కె. శర్మ భేటీ

Intro:AP_ONG_62_31_YCP_SHARIMILA_PRACHARAM_AVB_C4

కంట్రిబ్యూటర్ నటరాజు

సెంటర్ అద్దంకి

--------------------------------------------------

ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం సంతమాగులూరు బస్టాండ్ సమీపంలో లో వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి నందిగామ సురేష్ అద్దంకి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి బాచిన చెంచుగరటయ్య హాజరయ్యారు. వైకాపా నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. షర్మిల మాట్లాడుతూ బాబు వస్తే జాబు వస్తుందని చంద్రబాబు చెప్పిన విధంగా ఏ ఒక్కరికైనా జాబులు వచ్చావా అని ప్రశ్నించారు. చంద్రబాబు తనయుడు లోకేష్ కి తప్ప మిగిలినవి ఎవరికైనా నా జాబ్ వచ్చిందా అని సీఎం నో విమర్శించారు. జగనన్న రాజ్యం వచ్చినప్పుడే ప్రజల సుఖ సంతోషాలతో ఉంటారని షర్మిల తెలియజేశారు. జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలు గురించి ప్రజలకు వివరించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్న రాజ్యం వచ్చేలా చేయాలనే ప్రజలకు తెలియజేశారు.

BITE : వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల


Body:.


Conclusion:.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.