కరోనా వల్ల రాజధాని రైతులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని మంత్రి బొత్సకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ లేఖ రాశారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు కౌలు చెల్లించాలని కోరారు. 2 ఎకరాలలోపు ఉన్న రైతులు 20 వేల మంది ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. జూన్ వచ్చినా కౌలు చెల్లించకపోవడంతో ఆందోళన చెందుతున్నారని లేఖలో పేర్కొన్నారు.
ఇవీ చదవండి