ETV Bharat / state

'భాజపా కన్నెర్ర చేస్తే... ప్రాంతీయ పార్టీలు అడ్రెస్ లేకుండా పోతాయ్'

author img

By

Published : Jan 8, 2021, 4:32 PM IST

ఏపీలో హిందూ ఆలయాలపైన దాడులు పెరిగిపోయాయని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. ప్రభుత్వం ఆకతాయిల పనిగా ప్రచారం చేసి.. చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. రామతీర్థంలో రాముని తల తొలగిస్తే ప్రజలు ఆవేదన చెందారని.. కానీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.

mp gvl comments on government
భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు

రామతీర్థంలో వైకాపా, తెదేపా నాయకులకు లేని ఆంక్షలు భాజపా పైనే ఎందుకని ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రశ్నిచారు. భాజపా కన్నెర్ర చేస్తే... ప్రాంతీయ పార్టీలు అడ్రెస్ లేకుండా పోతాయన్నారు. నిన్న రామతీర్థంలో జరిగిన పరిణామాలను కేంద్రం, పార్టీ పెద్దలకు వివరించామని తెలిపారు. కిషన్​రెడ్డి, సోము వీర్రాజు అడిగి వివరాలు తెలుసుకున్నారని, అమిత్ షాకు కూడా వినతిపత్రం ద్వారా పరిస్థితిని వివరిస్తామన్నారు. తమకు అనుమతి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం... 7వ తేదీన ఉద్దేశపూర్వకంగా అడ్డుకుందని ఆయన దుయ్యబట్టారు. వైకాపా ప్రభుత్వం అకృత్యాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. మత సామరస్యాన్ని పెంపొందించేందుకు కమిటీలు అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.

ఏపీలో హిందూ మతంపై దాడి జరుగుతుంటే... అన్ని‌మతాలతో కమిటీలు ఎందుకని జీవీఎల్‌ నరసింహారావు నిలదీశారు. ఇతర మతాల పెద్దలు, కమిటీలు ఈ దాడులను ఎందుకు ఖండించరని ప్రశ్నించారు.. కమిటీలలో అన్ని మతాల నుంచి ప్రతినిధులు ఉంటారని చెబుతున్నారన్నారు. ఏపీలో తొంభై‌శాతం హిందువులు ఉన్నారని, హిందూ మతం పై దాడి చేస్తే ఇతర మతస్థులు కమిటీలలో ఉండి ఏం‌ చేస్తారని ప్రశ్నించారు. ఓ మతంపై మరో మతం వారు దాడి చేయడం లేదని, అందరూ అన్నదమ్ముల్లా కలిసి ఉన్నారని... వారి మధ్య విద్వేషాలు సృష్టించ వద్దని హెచ్చరించారు.

భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు

ఇప్పటి‌వరకు జరిగిన దాడుల్లో ఎంత మందిని అరెస్టు చేశారని, వారెవరు, ఏ సెక్షన్లు పెట్టారో ప్రభుత్వం ఎందుకు చెప్పదని నిలదీశారు. వైకాపా రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చూడండి. కృష్ణపట్నాన్ని పారిశ్రామిక కేంద్రంగా మార్చాలని కేంద్ర నిర్ణయం: జీవీఎల్

రామతీర్థంలో వైకాపా, తెదేపా నాయకులకు లేని ఆంక్షలు భాజపా పైనే ఎందుకని ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రశ్నిచారు. భాజపా కన్నెర్ర చేస్తే... ప్రాంతీయ పార్టీలు అడ్రెస్ లేకుండా పోతాయన్నారు. నిన్న రామతీర్థంలో జరిగిన పరిణామాలను కేంద్రం, పార్టీ పెద్దలకు వివరించామని తెలిపారు. కిషన్​రెడ్డి, సోము వీర్రాజు అడిగి వివరాలు తెలుసుకున్నారని, అమిత్ షాకు కూడా వినతిపత్రం ద్వారా పరిస్థితిని వివరిస్తామన్నారు. తమకు అనుమతి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం... 7వ తేదీన ఉద్దేశపూర్వకంగా అడ్డుకుందని ఆయన దుయ్యబట్టారు. వైకాపా ప్రభుత్వం అకృత్యాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. మత సామరస్యాన్ని పెంపొందించేందుకు కమిటీలు అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.

ఏపీలో హిందూ మతంపై దాడి జరుగుతుంటే... అన్ని‌మతాలతో కమిటీలు ఎందుకని జీవీఎల్‌ నరసింహారావు నిలదీశారు. ఇతర మతాల పెద్దలు, కమిటీలు ఈ దాడులను ఎందుకు ఖండించరని ప్రశ్నించారు.. కమిటీలలో అన్ని మతాల నుంచి ప్రతినిధులు ఉంటారని చెబుతున్నారన్నారు. ఏపీలో తొంభై‌శాతం హిందువులు ఉన్నారని, హిందూ మతం పై దాడి చేస్తే ఇతర మతస్థులు కమిటీలలో ఉండి ఏం‌ చేస్తారని ప్రశ్నించారు. ఓ మతంపై మరో మతం వారు దాడి చేయడం లేదని, అందరూ అన్నదమ్ముల్లా కలిసి ఉన్నారని... వారి మధ్య విద్వేషాలు సృష్టించ వద్దని హెచ్చరించారు.

భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు

ఇప్పటి‌వరకు జరిగిన దాడుల్లో ఎంత మందిని అరెస్టు చేశారని, వారెవరు, ఏ సెక్షన్లు పెట్టారో ప్రభుత్వం ఎందుకు చెప్పదని నిలదీశారు. వైకాపా రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చూడండి. కృష్ణపట్నాన్ని పారిశ్రామిక కేంద్రంగా మార్చాలని కేంద్ర నిర్ణయం: జీవీఎల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.