విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆషాఢమాస చివరి ఆదివారం సందర్భంగా... అమ్మవారికి సారె సమర్పించేందుకు పోటీ పడ్డారు. ఉదయం నుంచి బృందాలుగా ఆలయానికి చేరుకుని.. మొక్కులు తీర్చుకున్నారు. ఈ ఒక్క రోజులోనే 11 వందల మంది భక్తులు అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించినట్టు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి : ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మదినోత్సవం