thumbnail

తిరుమల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ - శాస్త్రోక్తంగా ధ్వజారోహణం - TIRUMALA BRAHMOTSAVAM

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

Tirumala Srivari Salakatla Brahmotsavam : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణం శాస్త్రోక్తంగా జరిగింది. ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ అర్చకులు గరుడపటాన్ని ఎగురేశారు. సాయంత్రం 5.45 గంటల నుంచి 6 గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం (Dwajarohanam Program at Tirumala) నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణంతో అంకురార్పణ జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేశారు. 

ఈ కార్యక్రమం ద్వారా సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. కాగా రాత్రి 9 నుంచి 11 గంటల వరకు పెద్ద శేష వాహన సేవలు ప్రారంభమవుతాయి.  ఈ క్రమంలో తిరుమలలో ఫలపుష్ప ప్రదర్శనశాలను ఈవో, అదనపు ఈవో ప్రారంభించారు. టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో కల్యాణవేదిక వద్ద ఫలపుష్ప ప్రదర్శనశాల జరిగింది. ఫలపుష్పశాలను శ్యామలరావు, వెంకయ్యచౌదరి పరిశీలించారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఫలపుష్ప ప్రదర్శనశాల కనువిందు చేస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.