ETV Bharat / state

Road Accident: వేర్వేరు చోట్ల ప్రమాదాలు...గాయపడ్డ 14మంది ప్రయాణికులు

author img

By

Published : Mar 4, 2022, 9:42 AM IST

Road Accidents: కృష్ణాజిల్లాలో తిరువూరు వద్ద జాతీయ రహదారి, నెప్పల్లి కూడలి వద్ద జాతీయ రహదారులపై వేర్వేరు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో 18మంది ప్రయాణికులు గాయపడ్డారు.

Road Accidents
వేర్వేరు చోట్ల ప్రమాదాలు...గాయపడ్డ 14మంది ప్రయాణికులు...

Road Accident: కృష్ణాజిల్లా తిరువూరు వద్ద విజయవాడ వెళ్లే జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని టెంపో వాహనం వెనక నుంచి ఢీకొట్టింది. ప్రమాద సమయంలో టెంపో వాహనంలో 14మంది ప్రయాణికులున్నారు. వీరిలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా.. మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కొరకు విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తిరువూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రులు తమిళనాడు నుండి ఒరిస్సా వెళ్తున్నట్లు సమాచారం.

Bus Accident: కంకిపాడు మండలం నెప్పల్లి కూడలి వద్ద జాతీయ రహదారిపై రెండు బస్సులు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. విజయవాడ నుంచి నాగాయలంక వెళ్తున్న పాసింజర్ బస్సు నెప్పల్లి కూడలి వద్ద ప్రయాణికులను ఎక్కించుకునేందుకు ఆగిన సమయంలో వెనక నుంచి మచిలీపట్నం వెళ్తున్న నాన్​ స్టాప్ బస్సు ఢీకొంది. ప్రమాదం జరిగిన సమయంలో కూడలి వద్ద పెద్ద సంఖ్యలో స్థానికులున్నారు. క్షతగాత్రులను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో ఎవరికి తీవ్రగాయాలు కాకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం తెలుసుకున్న కంకిపాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Road Accident: కృష్ణాజిల్లా తిరువూరు వద్ద విజయవాడ వెళ్లే జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని టెంపో వాహనం వెనక నుంచి ఢీకొట్టింది. ప్రమాద సమయంలో టెంపో వాహనంలో 14మంది ప్రయాణికులున్నారు. వీరిలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా.. మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కొరకు విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తిరువూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రులు తమిళనాడు నుండి ఒరిస్సా వెళ్తున్నట్లు సమాచారం.

Bus Accident: కంకిపాడు మండలం నెప్పల్లి కూడలి వద్ద జాతీయ రహదారిపై రెండు బస్సులు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. విజయవాడ నుంచి నాగాయలంక వెళ్తున్న పాసింజర్ బస్సు నెప్పల్లి కూడలి వద్ద ప్రయాణికులను ఎక్కించుకునేందుకు ఆగిన సమయంలో వెనక నుంచి మచిలీపట్నం వెళ్తున్న నాన్​ స్టాప్ బస్సు ఢీకొంది. ప్రమాదం జరిగిన సమయంలో కూడలి వద్ద పెద్ద సంఖ్యలో స్థానికులున్నారు. క్షతగాత్రులను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో ఎవరికి తీవ్రగాయాలు కాకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం తెలుసుకున్న కంకిపాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి :

Viveka Murder Case:దస్తగిరి, రంగన్నకు భద్రత కల్పించేందుకు సీబీఐ చర్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.