ETV Bharat / state

సీఎం జగన్ మంచి మనసు... గంగిరెద్దుకు గాయం కాకూడదని..

author img

By

Published : Jan 15, 2021, 7:43 PM IST

Updated : Jan 15, 2021, 7:56 PM IST

గుంటూరు జిల్లా నరసరావుపేటలో శుక్రవారం జరిగిన గోపూజ కార్యక్రమంలో సీఎం చేసిన పని అందరినీ ఆకర్షించింది. తన ముందు ఆడుతోన్న గంగిరెద్దుకు గాయం కాకుండా ఆపారు ముఖ్యమంత్రి.

CM JAGAN
CM JAGAN
సీఎం జగన్ మంచి మనసు... గంగిరెద్దుకు దెబ్బ తగలకూడదని..

గుంటూరు జిల్లా నరసరావుపేటలో శుక్రవారం జరిగిన గోపూజ కార్యక్రమంలో ఓ దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. మున్సిపల్ స్టేడియం ప్రాంగణంలో జరిగిన ఈ మహోత్సవంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో గంగిరెద్దులతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. సీఎం రాగానే గంగిరెద్దు తన యజమాని చెప్పినట్లు ఆడుతోంది. ఆ సమయంలో పక్కనే బారికేడింగ్ కోసం ఏర్పాటు చేసిన ఇనుప కడ్డీ గంగిరెద్దు మెడకు తగులుతోంది. వెంటనే గమనించిన ముఖ్యమంత్రి గంగిరెద్దు మెడకు గాయమవుతుందనే ఉద్దేశంతో ఇనుప కడ్డీపై తన చేయి ఉంచారు. ఆ తర్వాత గంగిరెద్దు యజమానికి చెప్పి దాన్ని కొంచెం పక్కకు తప్పించారు. ఆ తర్వాత గోపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ఏర్పాటు చేసిన ఈ పూజా కార్యక్రమంలో ముఖ్యమంత్రి సంప్రదాయ పంచకట్టు, కండువాతో హాజరయ్యారు. వేద మంత్రాల నడుమ గో మాతకు, దూడకు పట్టు వస్త్రాలు, పూలమాలలు, పసుపు కుంకుమ సమర్పించి హారతి ఇచ్చారు. వాటి చుట్టూ ప్రదక్షిణ చేశారు.

ఇదీ చదవండి

నరసరావుపేటలో గోపూజ మహోత్సవం.. పాల్గొన్న సీఎం జగన్

సీఎం జగన్ మంచి మనసు... గంగిరెద్దుకు దెబ్బ తగలకూడదని..

గుంటూరు జిల్లా నరసరావుపేటలో శుక్రవారం జరిగిన గోపూజ కార్యక్రమంలో ఓ దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. మున్సిపల్ స్టేడియం ప్రాంగణంలో జరిగిన ఈ మహోత్సవంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో గంగిరెద్దులతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. సీఎం రాగానే గంగిరెద్దు తన యజమాని చెప్పినట్లు ఆడుతోంది. ఆ సమయంలో పక్కనే బారికేడింగ్ కోసం ఏర్పాటు చేసిన ఇనుప కడ్డీ గంగిరెద్దు మెడకు తగులుతోంది. వెంటనే గమనించిన ముఖ్యమంత్రి గంగిరెద్దు మెడకు గాయమవుతుందనే ఉద్దేశంతో ఇనుప కడ్డీపై తన చేయి ఉంచారు. ఆ తర్వాత గంగిరెద్దు యజమానికి చెప్పి దాన్ని కొంచెం పక్కకు తప్పించారు. ఆ తర్వాత గోపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ఏర్పాటు చేసిన ఈ పూజా కార్యక్రమంలో ముఖ్యమంత్రి సంప్రదాయ పంచకట్టు, కండువాతో హాజరయ్యారు. వేద మంత్రాల నడుమ గో మాతకు, దూడకు పట్టు వస్త్రాలు, పూలమాలలు, పసుపు కుంకుమ సమర్పించి హారతి ఇచ్చారు. వాటి చుట్టూ ప్రదక్షిణ చేశారు.

ఇదీ చదవండి

నరసరావుపేటలో గోపూజ మహోత్సవం.. పాల్గొన్న సీఎం జగన్

Last Updated : Jan 15, 2021, 7:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.