ETV Bharat / state

రెండు చట్టాలను సవాలు చేస్తూ హైకోర్టులో వ్యాజ్యాలు

పాలన వికేంద్రీకరణ, సీఆర్​డీఏ రద్దు చట్టాల్ని సవాలు చేస్తూ సోమవారం హైకోర్టులో మరో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని ఎమ్మెల్సీలు అశోక్​ బాబు, ఎ.ఎస్.రామకృష్ణ దాఖలు చేశారు.

author img

By

Published : Aug 11, 2020, 5:21 AM IST

ap high court
ap high court

పాలన వికేంద్రీకరణ, సీఆర్​డీఏ రద్దు చట్టాల్ని సవాలు చేస్తూ ఎమ్మెల్సీలు అశోక్‌బాబు, రామకృష్ణ హైకోర్టులో సోమవారం వ్యాజ్యాలు దాఖలు చేశారు. రాజ్యాంగ, శాసనసభ, మండలి నిబంధనలకు విరుద్ధంగా ఆ చట్టాలున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. వాటిని చట్టాలుగా పరిగణించేందుకు వీల్లేదన్నారు. ఈ చట్టాలు విభజన చట్టానికి విరుద్ధమన్నారు.

సెలెక్ట్‌ కమిటీ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లుల్ని మరోసారి శాసనసభలో ప్రవేశపెట్టడం రాజ్యాంగ ఉల్లంఘన అని ఎమ్మెల్సీలు అశోక్‌బాబు, రామకృష్ణ చెప్పారు. రాష్ట్ర సీఎస్, శాసనసభ కార్యదర్శి, గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, కేంద్ర హోంశాఖ, న్యాయశాఖల కార్యదర్శులను వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.

పాలన వికేంద్రీకరణ, సీఆర్​డీఏ రద్దు చట్టాల్ని సవాలు చేస్తూ ఎమ్మెల్సీలు అశోక్‌బాబు, రామకృష్ణ హైకోర్టులో సోమవారం వ్యాజ్యాలు దాఖలు చేశారు. రాజ్యాంగ, శాసనసభ, మండలి నిబంధనలకు విరుద్ధంగా ఆ చట్టాలున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. వాటిని చట్టాలుగా పరిగణించేందుకు వీల్లేదన్నారు. ఈ చట్టాలు విభజన చట్టానికి విరుద్ధమన్నారు.

సెలెక్ట్‌ కమిటీ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లుల్ని మరోసారి శాసనసభలో ప్రవేశపెట్టడం రాజ్యాంగ ఉల్లంఘన అని ఎమ్మెల్సీలు అశోక్‌బాబు, రామకృష్ణ చెప్పారు. రాష్ట్ర సీఎస్, శాసనసభ కార్యదర్శి, గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, కేంద్ర హోంశాఖ, న్యాయశాఖల కార్యదర్శులను వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.

ఇదీ చదవండి

ఫిర్యాదులను నిర్దేశిత కాలంలో పరిష్కరించాలి: సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.