ETV Bharat / state

'తెదేపా చేసిన అవమానంతోనే కోడెల ఆత్మహత్య'

author img

By

Published : Sep 17, 2019, 7:18 PM IST

తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు అవమానించడం కారణంగానే కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు పాల్పడ్డారని వైకాపా ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. 2014లో కోడెలకు మంత్రి పదవి ఇవ్వకుండా... స్పీకర్ చేసి... ఆయనతో తప్పులన్నీ చేయించారని రోజా విమర్శించారు. దేశంలో ఏ సభాపతికి లేని విధంగా చెడ్డపేరు వచ్చేలా చంద్రబాబు చేశారని ధ్వజమెత్తారు. విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడారు.

వైకాపా ఎమ్మెల్యే రోజా

రాజకీయ కక్షసాధింపే అయితే... కోడెల శివప్రసాదరావు పోరాడేవారనియ... ఆయన ఆత్మహత్య చేసుకునేంత బలహీనుడు కాదని వైకాపా ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. అసెంబ్లీ అధికారులు ఫర్నీచర్ కేసు ఫైల్ చేశారని... ప్రభుత్వం ఆయనపై, ఆయన కుటుంబ సభ్యులపై కేసులు పెట్టలేదన్నారు. ఎన్నో కష్టాలను చూసి ఆయన ఆ స్థాయికి వచ్చారన్నారు. శివప్రసాదరావు ఓడిపోయిన తర్వాత చంద్రబాబు అపాయింట్​మెంట్ కూడా ఇవ్వలేదన్నారు.

వైకాపా ఎమ్మెల్యే రోజా

చివరి నిమిషంలో చంద్రబాబు అపాయింట్​మెంట్ రద్దు చేసినందుకే... కోడెల ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. జగన్​పై బురద జల్లాలనే ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్​పై ఎన్నికేసులు పెట్టారని ప్రశ్నించారు. అవన్ని తప్పుడు కేసులని పోరాడి నిరూపించుకున్నట్లు తెలిపారు. చంద్రబాబు, తెదేపా చేసిన అవమానం భరించలేకే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండీ... శాసనసభ మాజీ స్పీకర్ కోడెల గత చిత్రాలు

రాజకీయ కక్షసాధింపే అయితే... కోడెల శివప్రసాదరావు పోరాడేవారనియ... ఆయన ఆత్మహత్య చేసుకునేంత బలహీనుడు కాదని వైకాపా ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. అసెంబ్లీ అధికారులు ఫర్నీచర్ కేసు ఫైల్ చేశారని... ప్రభుత్వం ఆయనపై, ఆయన కుటుంబ సభ్యులపై కేసులు పెట్టలేదన్నారు. ఎన్నో కష్టాలను చూసి ఆయన ఆ స్థాయికి వచ్చారన్నారు. శివప్రసాదరావు ఓడిపోయిన తర్వాత చంద్రబాబు అపాయింట్​మెంట్ కూడా ఇవ్వలేదన్నారు.

వైకాపా ఎమ్మెల్యే రోజా

చివరి నిమిషంలో చంద్రబాబు అపాయింట్​మెంట్ రద్దు చేసినందుకే... కోడెల ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. జగన్​పై బురద జల్లాలనే ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్​పై ఎన్నికేసులు పెట్టారని ప్రశ్నించారు. అవన్ని తప్పుడు కేసులని పోరాడి నిరూపించుకున్నట్లు తెలిపారు. చంద్రబాబు, తెదేపా చేసిన అవమానం భరించలేకే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండీ... శాసనసభ మాజీ స్పీకర్ కోడెల గత చిత్రాలు

Intro:ap_knl_13_17_lawyars_dheksha_ab_ap10056
కర్నూల్లో హైకోర్టు ఏర్పాటు చేయాలని అని న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలు ఆరో రోజుకు చేరుకున్నాయి. నగరంలోని శ్రీకృష్ణదేవరాయల కూడలి వద్ద ఏర్పాటు చేసిన శిబిరానికి స్థానిక ఎమ్మెల్యే హఫీస్ ఖాన్ వెళ్లి న్యాయవాదులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 13 జిల్లాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కట్టుబడి ఉన్నారని కొంత సమయం ఇస్తే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని ఆయన న్యాయవాదులకు తెలిపారు
బైట్. హఫీస్ ఖాన్. కర్నూలు ఎమ్మెల్యే


Body:ap_knl_13_17_lawyars_dheksha_ab_ap10056


Conclusion:ap_knl_13_17_lawyars_dheksha_ab_ap10056
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.