గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడులో పోలీసులు సుమారు రెండు గంటలపాటు నిర్భంద తనిఖీలు నిర్వహించారు. సరైన గుర్తింపు పత్రాలు లేని 7 ద్విచక్రవాహనాలు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ సరిహద్దు నుంచి అక్రమ మద్యం రవాణాకు ఆస్కారం ఉండటంతో నాకాబందీ ద్వారా పోలీసులు సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. కొత్తగా అనుమానితులు ఎవరైనా వచ్చారా... అనే కోణంలోనూ ఈ తనిఖీలు చేపట్టారు.
ఇవీ చదవండి: ఎస్సై పేరుతో ఫేస్బుక్ ఖాతా... అప్రమత్తంగా లేకుంటే బుక్కైపోతారు!