ETV Bharat / state

'కలిసి పని చేయండి.. అభివృద్ధిలో భాగం కండి'

అధికారంలో ఉన్నప్పుడు అణిగిమణిగి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దూకుడుగా ఉండాలని.. నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు అభిప్రాయపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో వైకాపా మద్దతుతో గెలుపొందిన సర్పంచిలను.. హోంమంత్రి సుచరితతో కలసి గుంటూరు జిల్లా కాకుమానులో ఆయన సత్కరించారు.

author img

By

Published : Feb 27, 2021, 7:20 AM IST

mp krishnadevarayalu honored sarpanches in kakamanu
వైకాపా మద్దతుతో గెలిచిన సర్పంచిలకు కాకమానులో ఎంపీ సత్కారం

వైకాపా మద్దతుతో గెలిచిన సర్పంచిలను.. గుంటూరు జిల్లా కాకమానులో ఎంపీ కృష్ణదేవరాయలు సత్కరించారు. హోంమంత్రి సుచరితతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉండగా అవమానించినా.. ఇప్పుడు సమయం వచ్చింది కదా అని ప్రతాపం చూపించకుండా గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీ హితవు పలికారు.

"నాకు, నా కుటుంబానికి ఈ ప్రభుత్వంలో ఏ మేలు జరిగింది" అని ప్రస్తుతం ప్రజలు బేరీజు వేసుకుంటున్నారన్నారని ఎంపీ పేర్కొన్నారు. అందుకే నవరత్నాల పేరిట ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు చేరే విధంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అందరూ కలసి కట్టుగా పని చేసి.. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

వైకాపా మద్దతుతో గెలిచిన సర్పంచిలను.. గుంటూరు జిల్లా కాకమానులో ఎంపీ కృష్ణదేవరాయలు సత్కరించారు. హోంమంత్రి సుచరితతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉండగా అవమానించినా.. ఇప్పుడు సమయం వచ్చింది కదా అని ప్రతాపం చూపించకుండా గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీ హితవు పలికారు.

"నాకు, నా కుటుంబానికి ఈ ప్రభుత్వంలో ఏ మేలు జరిగింది" అని ప్రస్తుతం ప్రజలు బేరీజు వేసుకుంటున్నారన్నారని ఎంపీ పేర్కొన్నారు. అందుకే నవరత్నాల పేరిట ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు చేరే విధంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అందరూ కలసి కట్టుగా పని చేసి.. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి:

సంగం డెయిరీని నిర్వీర్యం చేసేందుకు కుట్ర: ధూళిపాళ్ల

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.