వైకాపా మద్దతుతో గెలిచిన సర్పంచిలను.. గుంటూరు జిల్లా కాకమానులో ఎంపీ కృష్ణదేవరాయలు సత్కరించారు. హోంమంత్రి సుచరితతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉండగా అవమానించినా.. ఇప్పుడు సమయం వచ్చింది కదా అని ప్రతాపం చూపించకుండా గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీ హితవు పలికారు.
"నాకు, నా కుటుంబానికి ఈ ప్రభుత్వంలో ఏ మేలు జరిగింది" అని ప్రస్తుతం ప్రజలు బేరీజు వేసుకుంటున్నారన్నారని ఎంపీ పేర్కొన్నారు. అందుకే నవరత్నాల పేరిట ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు చేరే విధంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అందరూ కలసి కట్టుగా పని చేసి.. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: