Chhattisgarh Encounter Today : ఛత్తీస్గఢ్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. బస్తర్ రేంజ్లోని దంతెవాడ- నారాయణ్పుర్ సరిహద్దులో ఎన్కౌంటర్ జరిగినట్లు అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో వివిధ ఆయుధాలతోపాటు భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
అబూజ్మడ్ దండకారణ్యంలో మావోయిస్టులు నక్కినట్లు సమాచారం అందింది. దీంతో భద్రతా సిబ్బంది ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం భద్రతా దళాలను చూసిన మావోయిస్టులు వారిపై కాల్పులకు దిగగా, భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. దీంతో ఏడుగురు మూవోయిస్టులు మరణించారు.