ETV Bharat / state

'దళితుల అభివృద్దికి సీఎం జగన్ కృషి చేస్తున్నారు' - ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వార్తలు

జగనన్న వైఎస్ఆర్ బడుగు వికాసంతో దళితులకు ఎంతో మేలు జరుగుతుందని గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. నామినేటేడ్ పదవుల్లో దళితులకు పెద్దపీట వేశారని ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు.

mla undavalli sridevi  happy on jagananna ysr badugu vikasam scheme
ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి
author img

By

Published : Oct 26, 2020, 11:02 PM IST

దళితుల అభివృద్దికి సీఎం జగన్ పాటుపడుతున్నారని గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కొనియాడారు. అంబేడ్కర్​ ఆశయాలను సీఎం జగన్ సాకారం చేస్తున్నారన్నారు. దళితుల్లోనూ పారిశ్రామికవేత్తలను తయారు చేయడం కోసం 2021-2023 ప్రత్యేక పారిశ్రామిక విధానం తీసుకురావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ విధానంతో వెనుబడిన వర్గాలకు ఎంతో మేలు జరుగుతుందని ఎమ్మెల్యే శ్రీదేవి ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం మాటల మనిషి కాదని చేతల మనిషని... ఎస్సీ,ఎస్టీల పారిశ్రామిక విధానాన్ని ఏర్పాటు చేసి నిరూపించారన్నారు. ఇండస్ట్రీయల్ పార్కుల్లో ఎస్సీలకు 16.2 శాతం, ఎస్టీలకు 6 శాతం భూములు కేటాయించడంతో దళితులు మరింత వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందన్నారు.
ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రూ.1 కోటి రూపాయిల ఇన్సెంటివ్‌లు ఇవ్వడం మంచి పరిణామం అన్నారు. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని ఆమె సూచించారు.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నామినేటేడ్ పదవుల్లో దళితులకు పెద్దపీట వేశారని ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు.

దళితుల అభివృద్దికి సీఎం జగన్ పాటుపడుతున్నారని గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కొనియాడారు. అంబేడ్కర్​ ఆశయాలను సీఎం జగన్ సాకారం చేస్తున్నారన్నారు. దళితుల్లోనూ పారిశ్రామికవేత్తలను తయారు చేయడం కోసం 2021-2023 ప్రత్యేక పారిశ్రామిక విధానం తీసుకురావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ విధానంతో వెనుబడిన వర్గాలకు ఎంతో మేలు జరుగుతుందని ఎమ్మెల్యే శ్రీదేవి ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం మాటల మనిషి కాదని చేతల మనిషని... ఎస్సీ,ఎస్టీల పారిశ్రామిక విధానాన్ని ఏర్పాటు చేసి నిరూపించారన్నారు. ఇండస్ట్రీయల్ పార్కుల్లో ఎస్సీలకు 16.2 శాతం, ఎస్టీలకు 6 శాతం భూములు కేటాయించడంతో దళితులు మరింత వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందన్నారు.
ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రూ.1 కోటి రూపాయిల ఇన్సెంటివ్‌లు ఇవ్వడం మంచి పరిణామం అన్నారు. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని ఆమె సూచించారు.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నామినేటేడ్ పదవుల్లో దళితులకు పెద్దపీట వేశారని ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు.

ఇదీ చూడండి. ఏవోబీలో మందుపాతర పేల్చిన మావోయిస్టులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.