ETV Bharat / state

గుంటూరు జిల్లాలో లాక్​డౌన్​ కఠినతరం - గుంటూరులో లాక్​డౌన్​

గుంటూరు జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్నందున పోలీసు యంత్రాం ఆంక్షలను కఠినతరం చేసింది. ప్రభుత్వం కేటాయించిన పాక్షిక సమయం అనంతరం బయటకు వచ్చినవారిపై కేసులు నమోదు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి వెళ్లే రైతులు మాస్కులు, జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్​ ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేశారు.

lockdown running strict in guntur district
గుంటూరు జిల్లా అంతటా లాక్​డౌన్​
author img

By

Published : Apr 10, 2020, 6:09 PM IST

కరోనా పాజిటివ్​ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నందున గుంటూరు జిల్లా పోలీసులు లాక్​డౌన్​ను కఠినతరం చేశారు. ఈ మేరకు అధికార యంత్రాంగం కఠిన నిర్ణయం అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే నిత్యావసర సరుకులు, కూరగాయల కొనుగోలుకు ఉదయం 9 గంటల వరకే పాక్షికంగా అనుమతి ఇచ్చారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వాహనాలు నియంత్రించారు. రెడ్​ జోన్​ ప్రాంతాలైతే కర్ఫ్యూ వాతావరణం తలపించాయి. గ్రామీణ ప్రాంతాల్లో పరిమిత ఆంక్షలతో లాక్​డౌన్​ను అమలు చేశారు. వ్యవసాయ పనులకు వెళ్లే వారికి సరైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కూలీలు తీసుకెళ్తున్న వాహనాలను పట్టుకుని సీజ్​ చేశారు. నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేశారు.

ఇదీ చదవండి:

కరోనా పాజిటివ్​ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నందున గుంటూరు జిల్లా పోలీసులు లాక్​డౌన్​ను కఠినతరం చేశారు. ఈ మేరకు అధికార యంత్రాంగం కఠిన నిర్ణయం అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే నిత్యావసర సరుకులు, కూరగాయల కొనుగోలుకు ఉదయం 9 గంటల వరకే పాక్షికంగా అనుమతి ఇచ్చారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వాహనాలు నియంత్రించారు. రెడ్​ జోన్​ ప్రాంతాలైతే కర్ఫ్యూ వాతావరణం తలపించాయి. గ్రామీణ ప్రాంతాల్లో పరిమిత ఆంక్షలతో లాక్​డౌన్​ను అమలు చేశారు. వ్యవసాయ పనులకు వెళ్లే వారికి సరైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కూలీలు తీసుకెళ్తున్న వాహనాలను పట్టుకుని సీజ్​ చేశారు. నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేశారు.

ఇదీ చదవండి:

గుంటూరు నగరాన్ని ఇలా ఎప్పడూ చూసి ఉండరు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.