గతంలో కిడ్నీ మార్పిడి చేయించుకున్న తమకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని... బాధితులు గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర వైద్యశాల ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ధర్నా చేస్తున్న పదిమంది వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి కొత్తపేట స్టేషన్కు తరలించారు. శాంతియుతంగా ప్లకార్డ్స్ పట్టుకుని నిలుచుంటే...అదుపులోకి తీసుకోవడం దారుణమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి...గుంటూరు జీజీహెచ్లో నూతన పథకం...ఇవాళ ప్రారంభించనున్న సీఎం